'విక్రమ్‌' నుంచి నిలిచిన సంకేతాలు

బెంగళూరు: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి దశలో ఇబ్బంది నెలకొంది. విక్రమ్‌ ల్యాండర్‌ మృదువుగా చంద్రుడిపై దిగుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అన్ని దశలనూ 




విజయవంతంగా దాటుకుంటూ వచ్చినా గమ్యం ముంగిట్లో తడబాటు ఎదురైంది. ముందు నుంచి ఆఖరి 15 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతూనే వచ్చారు. ఈ 15 నిమిషాల్లో 14 నిమిషాలు ఎంతో సాఫీగానే సాగిపోయాయి. ప్రతి అంచెనూ విజయవంతంగా అధిగమిస్తున్నప్పుడల్లా శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ఇక జాబిల్లిపై కాలుమోపడమే తరువాయి అనుకున్న దశలో ఊహించని అవాంతరం తలెత్తింది. విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి సంకేతాలు ఆగిపోయాయి

జాబిల్లి దిశగా 48 రోజుల అద్భుత ప్రయాణం తర్వాత ఈ వ్యోమనౌకకు ఈ పరిస్థితి ఎదురైంది

తుది ఘట్టం కోసం బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ఇస్‌ట్రాక్‌)లోని మిషన్‌ కంట్రోల్‌ కాంప్లెక్స్‌ (మాక్స్‌)లో శుక్రవారం సాయంత్రం నుంచి సిద్ధమయ్యారు. అర్ధరాత్రి దాటాక 1.38 గంటలకు ల్యాండింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆ దశలో భూకేంద్రం నుంచి మార్గనిర్దేశం లేని పరిస్థితుల్లో ల్యాండర్‌లోని సొంత మేధస్సు బాగానే పనిచేసింది. గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న విక్రమ్‌ ల్యాండర్‌ జోరుకు మొదట్లో అనుకున్న రీతిలోనే ముకుతాడు వేసింది. 'రఫ్‌ బ్రేకింగ్‌' దశను విజయవంతంగా పూర్తి చేసుకుంది. 10 నిమిషాల తర్వాత 'ఫైన్‌ బ్రేకింగ్‌' అంచె ఆరంభమైంది. అనుకున్న విధంగానే వేగం తగ్గుతూ వచ్చింది. జాబిల్లి ఉపరితలం చేరుకోవడానికి ఇంకా 2.1 కిలోమీటర్ల దూరం ఉందనగా అకస్మాత్తుగా ల్యాండర్‌ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. దీంతో శాస్త్రవేత్తల్లో అయోమయం నెలకొంది. సంకేతం కోసం కొద్దిసేపు ఎదురూచూశారు. ఫలితం లేకపోవడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ కె.శివన్‌ క్లుప్తంగా ఒక ప్రకటన వెలువరించారు. ''2.1 కిలోమీటర్ల వరకూ అంతా బాగానే సాగింది. ఆ తర్వాత ల్యాండర్‌ నుంచి భూ కేంద్రానికి సంకేతాలు స్తంభించాయి. సంబంధిత డేటాను విశ్లేషిస్తున్నాం'' అని పేర్కొన్నారు


ప్రధాని భరోసా..

ల్యాండర్‌ నుంచి సంకేతాలు అందడం లేదని ప్రకటించినప్పుడు ఇస్రో ఛైర్మన్ శివన్‌ ఒకింత ఉద్విగ్నానికి లోనయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. జీవితంలో ప్రతి ప్రక్రియలో జయాపజయాలు సాధారణమని, మీరు సాధించింది తక్కువేమీ కాదని మోదీ అన్నారు. భవిష్యత్‌పై ఆశావహ దృక్పథంలో ముందకు సాగుదామని శాస్త్రవేత్తలకు సూచించారు. భవిష్యత్‌లో విజయాన్ని అందుకుంటారన్న విశ్వాసం తనకుందన్నారు. దేశం మొత్తం మీ వెంటే ఉందని ధైర్యం చెప్పారు. తనతో పాటు ప్రయోగాన్ని వీక్షించేందుకు బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వచ్చిన చిన్నారులతో ఆయన కాసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు



Additional information


- 2.1 కిలోమీటర్ల దూరంలో ఆగిన ల్యాండర్‌ 
- జాబిల్లి యాత్రకు సాంకేతిక సమస్యలు 
- చంద్రయాన్‌-2 కారణాలను విశ్లేషిస్తాం : ఇస్రో చైర్మెన్‌ కె.శివన్‌ 
- ధైర్యం కోల్పోవద్దు.. దేశం మీ వెంటే ఉంది : మోడీ 
నరాలు తెగేంత ఉత్కంఠ.. 1.52 గంటలకు జాబిల్లిపై రోవర్‌ విక్రమ్‌ అడుగుపెడుతున్నదనీ.. దేశ,విదేశాలు ఉత్కంఠంగా ఎదురుచూశాయి. ప్రధాని మోడీ కూడా ఇస్రో ప్రధానకార్యాలయానికి చేరుకోవటంతో టెన్షన్‌.టెన్షన్‌. చంద్రయాన్‌..2 కు కౌంట్‌ డౌన్‌ షురూ అయింది. ఊపిరి బిగపట్టి.. చేతుల్లో హ్యాండ్‌ మైకులతో జాబిల్లి వైపు శాస్త్రవేత్తలు స్క్రీన్లవైపు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు



విక్రమ్‌ దిగే వేగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు తగ్గించారు. అదిగో...ఇదిగో...అంటున్న లోపు ఆ (15 నిమిషాల) టెర్రర్‌ టైమ్‌లోకి రోవర్‌ విక్రమ్‌ అడుగుపెట్టింది. సరిగ్గా గమ్యానికి 2.1 కిలోమీటర్‌ దూరంలో ఉన్నపుడు సిగల్‌ సమస్య తలెత్తింది. ల్యాండర్‌ నుంచి వెలువడే సంకేతాలు నిలిచిపోయాయని ఇస్రో చైర్మెన్‌ శివన్‌ వెల్లడించారు. సమస్య పూర్వాపరాలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. విక్రమ్‌ రోవర్‌తో లింక తెగిపోయిందని ఇస్రో చేసిన ప్రకటన యావత్‌ భారతావని షాక్‌కు గురైంది. 
బెంగళూరు : అందినట్టే అందిన చందమామ చివరిక్షణాల్లో జారిపోయాడు. 48 రోజుల సుదీర్ఘ ప్రయాణాన్ని, ఆటుపోట్లను ఎదుర్కొని చంద్రునిపైకి చేరిన చంద్రయాన్‌-2 చివర్లో తడబాటుకు గురైంది. చంద్రుని ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్‌ రోవర్‌ ఆ దిశలో ప్రయాణం ప్రారంభించిన కాసేపటికే ఆటంకాలను ఎదుర్కొంది. తొలిదశలో సజావుగానే అందిన సంకేతాలు మలిదశ ప్రారంభమైన కాసేపటికే విక్రమ్‌ నుంచి నిలిచిపోయాయి. దీంతో బెంగళూరులోని ఇస్ట్రాక్‌లో నరాలు తెగే ఉత్కంఠ! చంద్రుడికి 2.1 కిలోమీటర్ల వద్ద ల్యాండర్‌ (విక్రమ్‌) నుంచి సంకేతాలు ఆగిపోవడంతో అప్పటివరకూ అంతా సవ్యంగా సాగుతున్న నూట ముప్పై కోట్ల ప్రజల ప్రతినిధి జాబిల్లి యాత్ర.. రెండడుగుల దూరంలో ఆగిపోయింది. ప్రధాని మోడీ సహా ఇస్రో శాస్త్రవేత్తలు, దేశ ప్రజలు నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షిస్తున్న సమయంలో ల్యాండర్‌ నుంచి సంకేతాలు రావడం నిలిచిపోయాయి. చివరి దశలో ల్యాండర్‌లో సమస్య తలెత్తడంతో వాహననౌక నుంచి సిగల్స్‌ తెగిపోయాయి. దీంతో అందరి ముఖాల్లోనూ అప్పటిదాకా ఉన్న నవ్వు మాయమై టెన్షన్‌ వాతావరణం నెలకొన్నది. దాదాపు అరగంట వరకూ వేచి చూసిన అనంతరం.. ఉద్విగ వాతావరణంలో ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ మాట్లాడుతూ.. సాంకేతిక కారణాల వల్ల ల్యాండర్‌ నుంచి సంకేతాలు కోల్పోయామనీ, పరిస్థితులను విశ్లేషిస్తున్నామని ప్రకటించారు. అనంతరం మోడీ వారిదగ్గరకు వచ్చి మాట్లాడారు. 'మీరు సాధించింది తక్కువేం కాదు. ధైర్యం కోల్పోవద్దు. యావత్‌ దేశం మొత్తం మీ వెంటే ఉంది. భవిష్యత్తుపై ఆశావాహా దృక్పథంతో ఉండండి' అని శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు.
ఉత్కంఠ.. 
చంద్రుని దిశగా చేసిన సుదీర్ఘ ప్రయాణంలో అత్యంత కీలకమైన దశ శనివారం తెల్లవారుజామున 1.43 గంటలకు ప్రారంభమైంది. బెంగళూరులోని ఇస్రో కార్యాలయం నుంచి శాస్త్రవేత్తలు పంపిన ఆదేశాలకు అనుగుణంగా అంతరిక్ష నౌకలోని విక్రమ్‌ ల్యాండర్‌ స్పందిం చడం ఆ క్షణం నుండే ప్రారంభమైంది. చంద్రుని వైపు ప్రయాణాన్ని అత్యంత సున్నితంగా పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఇస్ట్రాక్‌ (ఐఎస్‌టీఆర్‌ఏసీ) లోని శాస్త్రవేత్తల్లో తీవ్ర ఉత్కంఠ! సుదీర్ఘప్రయాణం అనంతరం ఇస్తున్న ఆదేశాలకు విక్రమ్‌ ఎలా స్పందిస్తుందో అన్న ఉద్వేగం అయితే, విక్రమ్‌ ఈ ఆదేశాలను అందుకుంది. చంద్రునివైపుగా 
అడ్డంగా ప్రయాణం ప్రారంభించింది.7.4 కి.మీల తొలి దశ ప్రయణం సరిగ్గా 60 సెకన్లలో ముగిసింది. 1.53 గంటలకు తొలిదశ (రఫ్‌ బ్రేకింగ్‌) విజయవంతమైంది. 
ఆగిన సంకేతాలు! 
ఆ వెంటనే మరో 5 కిలో మీటర్ల ఫైన్‌ బ్రేకింగ్‌ దశ ప్రారంభమైంది. 53 సెకన్లలో ఈ దూరాన్ని విక్రమ్‌ అధిగమించాల్సిఉంది. ఆ తరువాత అత్యంత కీలకమైన నిట్టనిలువుగా చంద్రునిపైకి దిగే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అయితే, ఇక్కడే.. ఆ 53 సెకన్లలోనే జరగరానిది ఏదో జరిగింది. ఆ సమయంలో చంద్రునిపైకి 300 మీటర్ల దూరంలో విక్రమ్‌ ఉంది! అప్పటి వరకు విక్రమ్‌ నుండి ఇస్ట్రాక్‌కు అందుతున్న సంకేతా లు నిలిచిపోయి. అంతే.. అంతా ఉత్కంఠ! ఏం జరుగుతుందోనన్న ఆందోళన! శాస్త్రవేత్తలు, ఇంజినీర్లతో పాటు దేశ ప్రజలంతా ఊపిరిబిగబెట్టి ఏం జరుగుతుందోనని ఎదురుచూసిన క్షణాలవి. సెకన్లు, నిమిషాలుగా గడిచిపోతున్నా విక్రమ్‌ నుంచి సంకేతాలు ఇస్ట్రాక్‌కు అందలేదు. 
టెన్షన్‌..టెన్షన్‌.. 
మరికొద్ది సేపట్లో సక్సెస్‌ను అందుకుంటామనుకున్న శాస్త్రవేత్తలతో పాటు చంద్రయాన్‌.2 ఘనత కండ్లారా చూడాలనుకున్న అందరి ముఖాల్లోనూ అప్పటిదాకా ఉన్న చిరునవ్వు మాయమై టెన్షన్‌ వాతావరణం నెలకొన్నది. చివరగా ల్యాండర్‌ నుంచి శనివారం 1.36 నిమిషాలకు సంకేతాలు అందాయి. దాదాపు అరగంట వరకూ చూశాక..విషయాన్ని ప్రధాని మోడీకి ఇస్రో చైర్మెన్‌ వివరించారు. ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఉన్న మోడీ కొద్ది సేపు అక్కడ నుంచి నిష్క్రమించారు. మళ్లీ ప్రధాని వచ్చేలోపు.. ఇస్రో చైర్మెన్‌ కె.శివన్‌ మాట్లాడుతూ.. సాంకేతిక కారణాల వల్ల ల్యాండర్‌ నుంచి సంకేతాలు కోల్పోయామనీ, పరిస్థితులను విశ్లేషిస్తున్నామని ప్రకటించారు. చంద్రయాన్‌..2ను తిలకించటానికి వచ్చిన పిల్లలతో ప్రధాని మోడీ ముచ్చటించారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. 'మీరు సాధించింది తక్కువేం కాదు. ధైర్యం కోల్పోవద్దు. యావత్‌ దేశం మొత్తం మీ వెంటే ఉంది. భవిష్యత్తుపై ఆశావాహా దృక్పథంతో ఉండండి' అని ధైర్యం 




SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "'విక్రమ్‌' నుంచి నిలిచిన సంకేతాలు"

Post a Comment