స్థాయి సంఘాలను ప్రకటించిన లోక్సభ
దిల్లీ: పార్లమెంటరీ స్థాయి సంఘాలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. వివిధ శాఖలకు ఛైర్మన్లు, సభ్యులను నియమించినట్లు లోక్సభ సచివాలయం వెల్లడించింది. కొందరు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు ఛైర్మన్ పదవులు దక్కాయి. పరిశ్రమల స్థాయి సంఘం ఛైర్మన్గా తెరాస నేత కేశవరావు నియమితులయ్యారు.
వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్గా వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి, రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖల స్థాయి సంఘం చైర్మన్గా టి.జి వెంకటేశ్ నియమితులయ్యారు. పెట్రోలియం స్థాయి సంఘం ఛైర్మన్గా భాజపా ఎంపీ రమేశ్ బిధురి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్థాయి సంఘానికి ఛైర్మన్గా కాంగ్రెస్ నేత శశిథరూర్ను నియమించారు
హోం వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్గా కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ, రక్షణ వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్గా భాజపా నేత జోయల్ ఓరం, విదేశీ వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్గా భాజపా సీనియర్ నేత పి.పి చౌదరి, అందులో సభ్యుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం నియమితులయ్యారు. గతంలో చిదంబరం హోం వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్గా వ్యవహరించారు. రైల్వే వ్యవహారాల స్థాయి సంఘానికి రాధామోహన్ సింగ్ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. ఎరువులు, రసాయనాల స్థాయి సంఘం ఛైర్మన్ బాధ్యతలు డీఎంకే ఎంపీ కనిమొళికి దక్కాయి. స్థాయి సంఘంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, అభిషేక్ మనుసింఘ్వి సభ్యులుగా ఉన్నారు
0 Response to "స్థాయి సంఘాలను ప్రకటించిన లోక్సభ"
Post a Comment