విద్యను కార్పొరేటీకరించం

2020లో డీఎస్సీ : మంత్రి సురేష్‌ 
ప్రజాశక్తి- ఎఎన్‌యు (గుంటూరు జిల్లా) 
గత ప్రభుత్వాల మాదిరి విద్యా రంగాన్ని ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ చేయబోమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. 


విశ్వవిద్యాలయాల్లోని ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 43వ వ్యవస్థాపక దినోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా బుధవారం నిర్వహించారు. ఉత్సవాలకు మత్స్య, పశుసంవర్థక, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణరావు, స్థానిక ఎమ్మెల్యే కె.వెంకటరోశయ్య ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సురేష్‌ మాట్లాడుతూ విద్యా రంగానికి బడ్జెట్లో 16 శాతం కేటాయించామని, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు
నూతన ఆలోచనలతో విద్యార్థులే వర్సిటీల ప్రతిష్టని పెంచాలని సూచించారు. అన్ని కాలేజీలు, వర్సిటీల్లో మౌలిక వసతులు కల్పిస్తామని, వాటి రూపురేఖలు మార్చేస్తామని తెలిపారు. వర్సిటీలు పరిశోధనలకు పెద్దపీట వేయాలని, సమాజానికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. అధ్యాపక పోస్టులను ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేస్తామని, ఈలోపు అవసరమైన చోట తాత్కాలిక పద్ధతిలో నియామకానికి విసిలకు అనుమతిస్తామని తెలిపారు. 2020లో డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యను కార్పొరేటీకరించం"

Post a Comment