2021లో మానవ సహిత అంతరిక్షయాత్ర:శివన్‌


భువనేశ్వర్‌: డిసెంబర్‌ 2021 కల్లా మానవ సహిత అంతరిక్ష యాత్ర చేయడమే లక్ష్యంగా దేశం ముందుకెళ్తోందని ఇస్రో ఛైర్మన్‌ శివన్ శనివారం వెల్లడించారు. చంద్రయాన్‌-2లోని 'విక్రమ్‌' అనుకున్న ప్రకారం చంద్రుడి ఉపరితలంపై దిగనప్పటికీ మిషన్‌ గగన్‌యాన్‌పై ఎలాంటి ప్రభావం చూపదని ఆయన అన్నారు. ఐఐటీ భువనేశ్వర్‌ 8వ స్నాతకోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్‌ శివన్ పాల్గొని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. చంద్రయాన్‌-2 ఆర్బిటర్ ఇంకా ఏడున్నర సంవత్సరాల పాటు సమాచారాన్ని పంపుతుంది, అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ల్యాండింగ్‌ మినహా అన్ని పక్కాగానే జరిగాయి. అలా అని ఇది విజయం సాధించినట్టు కాదా అని అడిగారు



2021 డిసెంబర్‌లో తలపెట్టే ఈ గగన్‌యాన్‌ ప్రాజెక్టులో తొలి భారతీయ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టు భారత సాంకేతిక పరిజ్ఞానం సామర్థ్యాన్ని చాటిచెప్పడానికి ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. అదేవిధంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ.. ఆవిష్కరణలు చేయాలంటే విద్యార్థులంతా బాగా శ్రమించాలని అన్నారు.

ఎడిసన్‌ బల్బు కనిపెట్టడానికి ఎన్ని సార్లు విఫలమయ్యాడు. ఇలాంటి వైఫల్యాలు విజయానికి అడ్డంకిగా మారకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ భువనేశ్వర్‌ డైరెక్టర్‌ ఆవీ రాజా కుమార్‌తో కలిసి 32 మందికి పీహెచ్‌డీ, 105 మందికి ఎంటెక్‌, 67 మందికి ఎమ్మెస్సీ, 152 మందికి బీటెక్‌ డిగ్రీల పట్టాలను అందజేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "2021లో మానవ సహిత అంతరిక్షయాత్ర:శివన్‌"

Post a Comment