10లో బిట్‌ పేపర్‌ తొలగింపు

*🌈10లో బిట్‌ పేపర్‌ తొలగింపు💫*

*🙋‍♂100 మార్కులకు రాత పరీక్ష.*

 *🙋‍♂ప్రతీ పేపర్‌లోనూ 18మార్కులు సాధించాల్సిందే.*

 *🙋‍♂ప్రభుత్వానికి ప్రతిపాదనలు.*


💁📑ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో బిట్‌ పేపర్‌ను తొలగించనున్నారు. ప్రశ్నపత్రంలోనే బహుళైచ్చిక ప్రశ్నలు ఇవ్వనున్నారు. 

💁📑ప్రశ్నపత్రం నమూనా పూర్తిగా మారనుంది. కొత్తగా రూపొందించిన నమూనా ప్రశ్నపత్రాన్ని పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రభుత్వానికి పంపింది. 

💁📑దీనిపై ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. గతంలో 20 అంతర్గత మార్కులు ఉండగా వాటిని తొలగించారు. 

💁📑దీంతో 100మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. హిందీ మినహా ప్రతి సబ్జెక్టుకు 2 పేపర్లు ఉంటాయి. 

💁📑ఇప్పటి వరకు 2 పేపర్లలో కలిపి 35 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లుగా పరిగణిస్తున్నారు. 

💁📑కొత్త విధానం ప్రకారం ప్రతి పేపర్‌లోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 18 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్లు పరిగణిస్తారు. 

💁📑జవాబు రాసే పేపర్లను బుక్‌లెట్‌ విధానంలో ఇవ్వాలని నిర్ణయించినా దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

*🙋‍♂ప్రశ్నపత్రం నమూనా ఇలా..*

*💁అర మార్కు ప్రశ్నలు 12 ఇస్తారు. వీటిని నేరుగా ప్రశ్నపత్రంలోనే ఇస్తారు. వీటిల్లో బహుళైచ్చికాలు, ఖాళీలు, జతపర్చడంలాంటివి ఉంటాయి. జవాబు పత్రంలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది.*

*💁ఒక మార్కు ప్రశ్నలు 8 ఉంటాయి. వాటికి 2, 3 లైన్లలో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.*

*💁2 మార్కుల ప్రశ్నలు 8, నాలుగు మార్కులవి 5 ఉంటాయి. మొత్తం 50 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది.*

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "10లో బిట్‌ పేపర్‌ తొలగింపు"

Post a Comment