10లో బిట్ పేపర్ తొలగింపు
*🌈10లో బిట్ పేపర్ తొలగింపు💫*
*🙋♂100 మార్కులకు రాత పరీక్ష.*
*🙋♂ప్రతీ పేపర్లోనూ 18మార్కులు సాధించాల్సిందే.*
*🙋♂ప్రభుత్వానికి ప్రతిపాదనలు.*
💁📑ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో బిట్ పేపర్ను తొలగించనున్నారు. ప్రశ్నపత్రంలోనే బహుళైచ్చిక ప్రశ్నలు ఇవ్వనున్నారు.
💁📑ప్రశ్నపత్రం నమూనా పూర్తిగా మారనుంది. కొత్తగా రూపొందించిన నమూనా ప్రశ్నపత్రాన్ని పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రభుత్వానికి పంపింది.
💁📑దీనిపై ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. గతంలో 20 అంతర్గత మార్కులు ఉండగా వాటిని తొలగించారు.
💁📑దీంతో 100మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. హిందీ మినహా ప్రతి సబ్జెక్టుకు 2 పేపర్లు ఉంటాయి.
💁📑ఇప్పటి వరకు 2 పేపర్లలో కలిపి 35 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లుగా పరిగణిస్తున్నారు.
💁📑కొత్త విధానం ప్రకారం ప్రతి పేపర్లోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 18 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్లు పరిగణిస్తారు.
💁📑జవాబు రాసే పేపర్లను బుక్లెట్ విధానంలో ఇవ్వాలని నిర్ణయించినా దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
*🙋♂ప్రశ్నపత్రం నమూనా ఇలా..*
*💁అర మార్కు ప్రశ్నలు 12 ఇస్తారు. వీటిని నేరుగా ప్రశ్నపత్రంలోనే ఇస్తారు. వీటిల్లో బహుళైచ్చికాలు, ఖాళీలు, జతపర్చడంలాంటివి ఉంటాయి. జవాబు పత్రంలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది.*
*💁ఒక మార్కు ప్రశ్నలు 8 ఉంటాయి. వాటికి 2, 3 లైన్లలో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.*
*💁2 మార్కుల ప్రశ్నలు 8, నాలుగు మార్కులవి 5 ఉంటాయి. మొత్తం 50 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది.*
0 Response to "10లో బిట్ పేపర్ తొలగింపు"
Post a Comment