RBI: లోన్ తీసుకున్నవారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్... ఇక ఆ ఛార్జీలు ఉండవు

మీరు పర్సనల్ లోన్ లేదా వాహన రుణం తీసుకున్నారా? సాధారణంగా లోన్ తీసుకునేప్పుడు నియమ నిబంధనల్లో ఫోర్ క్లోజర్ ఛార్జీలు లేదా ప్రీ-పేమెంట్ పెనాల్టీస్ ఉంటాయి. అంటే మీరు లోన్ ముందుగా క్లోజ్ చేసినందుకు ఛార్జీలు 




చెల్లించాలన్నమాట. ఉదాహరణకు మీరు 36 నెలల గడువుతో రూ.3 లక్షల వ్యక్తిగత రుణం తీసుకొని కొన్ని వాయిదాలు చెల్లించిన తర్వాత పర్సనల్ లోన్ క్లోజ్ చేయాలంటే ఛార్జీలు చెల్లించాలి. మీరు ముందుగానే రుణం తీర్చేసినా అసలుతో పాటు జరిమానా చెల్లించక తప్పదు. దీన్నే ఫోర్ క్లోజర్ ఛార్జీలు అంటారు. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు-NBFC ఈ ఛార్జీలను వసూలు చేస్తున్న వ్యవహారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టికి వెళ్లింది. ఇకపై ప్రీ-పేమెంట్ పెనాల్టీస్ లేదా ఫోర్ క్లోజర్ ఛార్జీలు వసూలు చేయొద్దంటూ ఆర్‌బీఐ ఆదేశించింది

కమర్షియల్ బ్యాంకులు ఫోర్ క్లోజర్ ఛార్జీలు లేదా ప్రీ-పేమెంట్ పెనాల్టీస్ వసూలు చేయకుండా 2014 మేలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆదేశాలు జారీ చేసింది. అయితే పర్సనల్ లోన్స్‌కు మినహాయింపు ఇచ్చింది. కొన్ని బ్యాంకులు మాత్రం ఫోర్ క్లోజర్ లేదా ప్రీ-పేమెంట్ ఛార్జీలు వసూలు చేయట్లేదు. ఈ ఛార్జీలు లేకుండానే లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు మాత్రం ఫోర్‌క్లోజర్ ఛార్జీలు తీసుకుంటున్నాయి. ఇది రుణాలు తీసుకున్నవారికి భారంగా మారింది. అప్పు తీర్చేస్తున్నా అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. వ్యాపారం కాకుండా ఇతర ఏ కారణాలతోనైనా ఎవరైనా లోన్ తీసుకుంటే ఫోర్‌క్లోజర్ లేదా ప్రీ-పేమెంట్ ఛార్జీలు తీసుకోవద్దని ఎన్‌బీఎఫ్‌సీలను ఆదేశించింది ఆర్‌బీఐ. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆర్‌బీఐ తెలిపింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "RBI: లోన్ తీసుకున్నవారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్... ఇక ఆ ఛార్జీలు ఉండవు"

Post a Comment