ఏడుగురు తెలుగు అభ్యర్థులకు ఐఏఎస్
సర్వీసులు కేటాయించిన యూపీఎస్సీ
ఈనాడు, హైదరాబాద్: సివిల్స్లో ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు అభ్యర్థులకు యూపీఎస్సీ
అధికారులు ఐఏఎస్ కేటాయించారు. మరో తొమ్మిది మందికి ఐపీఎస్, ఇద్దరికి ఐఎఫ్ఎస్ దక్కింది. మొత్తం మీద ఏపీ, తెలంగాణ నుంచి 31 మంది వరకు ఉన్నారు. దేశవ్యాప్తంగా 644 మందికి సర్వీసులు కేటాయించారు. వీరందరికీ ఈ నెల 26వ తేదీ నుంచి హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, ముస్సోరిలో ప్రాథమిక శిక్షణ ప్రారంభమవుతుంది. ఇది డిసెంబరు 6వ తేదీ వరకు కొనసాగుతుంది. గతంలో నాలుగు చోట్ల శిక్షణ ఇచ్చేవారు. ఈ సారి రెండు ప్రదేశాలకు కుదించారు
ఎంపికైన తెలుగు వారు
కర్నాటి వరుణ్రెడ్డి, అబ్దుల్ షాహిద్, సూర్యసాయి ప్రవీణ్చంద్, మల్లవరపు నవీన్, విష్ణుచరణ్, అశ్విజ, వైష్ణవి
0 Response to "ఏడుగురు తెలుగు అభ్యర్థులకు ఐఏఎస్"
Post a Comment