నేటి నుంచి అందుబాటులోకి అంతర్రాష్ట్ర పోర్టబిలిటీ

* వారం రోజుల్లో రేషన్‌ కార్డులను సరెండర్‌ చేయాలి 
* 72 లక్షల మంది ఇ-కెవైసి నమోదుకు దూరం 
* రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులకు 1.49లక్షల కార్డుల సరఫరా నిలిపివేత 



ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అంతర్‌ జిల్లాలకు చెందిన రేషన్‌కార్డు దారులు వారు ఎక్కడ నివాసం ఉంటే ఆ ప్రాంతంలో రేషన్‌ తీసుకునే అవకాశం కల్పించగా శుక్రవారం నుంచి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడైనా సరుకులు తీసుకునే పోర్టబిలిటీ సౌకర్యం కల్పించనుంది. తొలుత విజయవాడ ఆటోనగర్‌లోని 263 నెంబరు చౌకధరల దుకాణంలో పౌర సరఫరాల ఉన్నతాధికారులు లాంఛనంగా ప్రారంభించనున్నారు



ఇదే విధానం ఇటీవల తెలంగాణలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.32 కోట్ల యూనిట్స్‌కు సంబంధించి 1.47 కోట్ల రేషన్‌ కార్డులకు సంబంధించి 4.32 యూనిట్లు ఉండగా, ఇందులో నేటికీ ఈకెవైసి నమోదు కాని వారు 72లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు 13 జిల్లాల జాయింట్‌ కలెక్టర్ల సమావేశంలో పౌర సరపరాల శాఖ కమిషనరు కోన శశిధర్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.49లక్షల ఉద్యోగస్తుల కార్డులకు ఈ నెలలో సరుకులు నిలిపివేశామన్నారు. 


అధికారులు వారం రోజుల్లో బోగస్‌ రేషన్‌కార్డులు, మృతుల పేర్లతో కొనసాగుతున్న కార్డులను ప్రభుత్వానికి అప్పజెప్పాలన్నారు. బోగస్‌ కార్డులను తొలగించే అధికారం జిల్లాల జాయింట్‌ కలెక్టర్లకు ఇచ్చామన్నారు. బోగస్‌ కార్డుల ఏరివేతకు ఆరు అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. నాలుగు చక్రాల వాహనం కలిగిన వారు, విద్యుత్తు వాడకం 720 యూనిట్లు దాటినవారు, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కట్టేవారు, ఉద్యోగులు, 10 ఎకరాల భూమి కలిగిన వారు రేషన్‌ కార్డులు పొందడానికి అనర్హులుగా గుర్తించాలన్నారు. 



రాష్ట్ర వ్యాప్తంగా 20 నుంచి 30లక్షల బోగస్‌ కార్డులు ఉండవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. స్పందనలో రేషన్‌కార్డులకు అనేక అర్జీలు వస్తున్నాయన్నారు. ఒంగోలులో పని చేస్తున్న మునిసినల్‌ కార్మికురాలు తమ కార్డుకు సరఫరా నిలిపివేశారని తెలిపారని, కార్మికుల కార్డుకు సరఫరా ఎందుకు నిలిపివేశారని కనుక్కుంటే ఆమె మునిసిపల్‌ రెగ్యులర్‌ ఉద్యోగిగా తేలిందని, ఆమె నెలసరి జీతం రూ.48వేలుగా ట్రైజరీ లెక్కలు చెబుతున్నాయన్నారు. ఇటువంటి దరఖాస్తులు అనేకం వస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు సమావేశంలో తెలిపారు. 



గ్రామ సెక్రటరీలే నూతన రేషన్‌ కార్డులు మంజూరు చేస్తారు. అక్టోబరు 2నుంచి నూతన రేషన్‌ కార్డుల మంజూరును గ్రామ సెక్రటరీలే చూస్తారని పౌర సరఫరాల శాఖ కమిషనరు కోన శశిధర్‌ తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేటి నుంచి అందుబాటులోకి అంతర్రాష్ట్ర పోర్టబిలిటీ"

Post a Comment