ఉచితంగా వైద్య పరీక్షలు
30 సంవత్సరాలు పైబడిన వారిపై దృష్టి
రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులకు ప్రాధాన్యం
ఆయుష్మాన్ భారత్ కార్యశాలలో కేంద్ర నిర్ణయాలు వెల్లడి
బస్తీ దవాఖానాలకు కేంద్ర ఆరోగ్య ఉన్నతాధికారుల ప్రశంసలు
కేరళలో స్థానిక సంస్థలు బలోపేతంగా ఉండడం వల్ల క్షేత్రస్థాయిలో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత స్థాయి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి వరకూ దీర్ఘకాలిక అనారోగ్యాలకు ఉపశమన చికిత్స(పాలియేటివ్ కేర్)ను విజయవంతంగా అమలు చేస్తున్నారు.
* తమిళనాడులో అనుసరిస్తున్న సమగ్ర ఆరోగ్య విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం.
* కర్ణాటక సామాజిక ఆరోగ్య అధికారులను ఆరోగ్య ఉపకేంద్రాల స్థాయిలో నియమించి ఇతర రాష్ట్రాల కంటే హెల్త్ వెల్నెస్సెంటర్ల అమలులోముందంజలో ఉంది.
* ఒడిశాలోనూ స్టాఫ్నర్సులను సామాజిక ఆరోగ్య అధికారులుగా నియమించే ప్రక్రియను ప్రారంభించారు.
* ఏపీలో ప్రభుత్వ వైద్యంలో స్పెషలిస్టు వైద్యుల కొరతను అధిగమించడంలో భాగంగా అవసరమైనప్పుడు ప్రైవేటు వైద్యుల సేవలను టెలీమెడిసిన్ విధానంలో వినియోగించుకుంటున్నారు.
తెలంగాణలో బస్తీ దవాఖానాలు భేష్
పట్టణ మురికివాడల ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన ‘బస్తీ దవాఖానాల’ విధానానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఇతర రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కార్యశాలలో అభిప్రాయపడ్డారు. అంతకుముందు కేంద్ర ఆరోగ్య అధికారులు హైదరాబాద్లోని పలు బస్తీ దవాఖానాలను సందర్శించారు
0 Response to "ఉచితంగా వైద్య పరీక్షలు"
Post a Comment