సీపీఎస్ రద్దుకు త్వరలో చర్యలు
విజయవాడ, ఆగస్టు 10: సాధ్యమైనంత త్వరలో సీపీఎస్ రద్దుకు, అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశాలు ఏర్పాటు చేసుకుని త్వరితగతిన తగు నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హామీ ఇచ్చారు.
శనివారం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో ప్రతినిధి బృందం ఈ అంశాలపై ఆర్థికమంత్రి బుగ్గనను కలిసి త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరింది.
దీనిపై బుగ్గన స్పందించి త్వరలోనే ఈ అంశాలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు
0 Response to "సీపీఎస్ రద్దుకు త్వరలో చర్యలు"
Post a Comment