ఒకే బుల్లెట్‌...ఎదురుగా పోలీసులు.

ఇంటర్నెట్‌ డెస్క్ ప్రత్యేకం : '' మీ శరీరంలోని రక్తం వేడెక్కలేదా.. అయితే అది నీరుగా ఉండవచ్చు.దాని వెంటనే బయటకు పంపించి మాతృభూమికి సేవ చేసేందుకు ముందుకు రండి'' ఈ మాటలు బ్రిటిషుపాలనను తరిమికొట్టేందుకు విప్లవకారుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఇచ్చిన నిప్పుకణికలు.బ్రిటిషు సామ్రాజ్యవాదులు ఎన్ని తూటాలు పేల్చినా నేను ఎదుర్కొంటాను.. నేను ఎప్పటికీ స్వేచ్ఛగానే ఉంటాను అన్న చంద్రశేఖర్‌ ఆజాద్‌ చివరి రక్తపుబొట్టువరకు పోరాడి ప్రాణ త్యాగం చేశాడు.

బాల్యంలోనే విప్లవ భావాలు. 
మధ్యప్రదేశ్‌లోని జభువా జిల్లాలోని భవ్రా గ్రామంలో పండిత్‌ సీతారాం తివారీ, జగ్‌రాణి దేవిలకు 1906, జులై 23న జన్మించారు


బెనారస్‌లో విద్యనభ్యసిస్తున్న కాలంలో పలువురు యువ స్వాతంత్ర్యయోధులను కలుసుకునేవారు. ఆ చర్చల్లో బ్రిటిషువారు దేశాన్ని ఎలా దోచుకుంటున్నారో తెలిసేది. అసలు ఎక్కడో ఐరోపాలో ఉన్న చిన్నదేశమైన ఇంగ్లండ్‌ మన దేశాన్ని వలసవాద పాలనతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైనాన్ని ఆయన నిరసించారు.

నా పేరు ఆజాద్.. 
జలియన్‌వాలాబాగ్‌ మారణకాండ చంద్రశేఖర్‌ను తీవ్రంగా కలిచివేసింది. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న ఆయనను పోలీసులు అరెస్టుచేశారు. అప్పటికి ఆయనకు కేవలం 16 ఏళ్లే. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇలా ఉన్నాయి.

దీంతో న్యాయమూర్తి ఆయనకు కొరడా దెబ్బలను శిక్షగా విధించారు.

హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ 
బ్రిటిషువారిని వెళ్లగొట్టేందుకు విప్లవమే మార్గమని ఆయన విశ్వసించారు. ఆ సమయంలో హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ నేత రామ్‌ప్రసాద్‌ బిస్మిల్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ సంస్థలో చేరాడు.సంస్థను విస్తరించేందుకు వీలుగా అవసరమైన నిధుల కోసం రైలులో వెళుతున్న ఖజానా నిధులను దోపిడీ చేయాలని పథకం వేశారు.ఇందులో భాగంగా కాకోరీ వద్ద రైలును నిలిపివేసి గార్డ్‌ కేబిన్‌ నుంచి లాకర్‌లో ఉంచిన ధనాన్ని ఎత్తుకొని పారిపోయారు అయితే నగదు కేవలం 8 వేల రూపాయలు మాత్రమే ఉండటంతో సంస్థను ఆశించిన ప్రకారం విస్తరించలేకపోయారు. ప్రభుత్వం ఈ సంస్థ ను ఉగ్రవాదసంస్థగా ప్రకటించి గాలింపు చర్యలు ప్రారంభించింది.




భగత్‌సింగ్‌తో పరిచయం.. 
సహ పోరాటయోధుడైన భగత్‌సింగ్‌తో పరిచయం ఆజాద్‌ జీవితాన్ని ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు కూడా వీరితో కలిశారు. అనంతరం సంస్థను హిందుస్థాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ అసోసియేషన్‌గా మార్చారు. లాహోర్‌ నగరంలో బాంబులు వేసినందుకు ఆజాద్‌ లాహోర్‌ కుట్ర కేసు నమోదయింది.

పోలీసులకు లొంగకుండా ఉండేందుకు బలిదానం 
ఆజాద్‌ను పట్టుకునేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం గాలింపుచర్యలు తీవ్రం చేసింది. ఆయన తలపై రూ. 30 వేల రివార్డును ప్రకటించింది. అప్పట్లో 30 వేలంటే మాములు విషయం కాదు. 1931 ఫిబ్రవరి 27న ఆజాద్‌ అలహాబాద్‌లోని ఆల్‌ఫ్రెడ్‌పార్కులో ఉన్న విషయం పోలీసులకు తెలసింది. వెంటనే చుట్టుముట్టారు. ఆజాద్‌ తన తుపాకీతో వారిని నిలువరించాడు. చివరకు ఒకే బుల్లెట్‌ మిగిలింది. అవతల పదుల సంఖ్యలో పోలీసులున్నారు అయితే తాను ఒకర్ని చంపినా మిగిలినవారు తనను అదుపులోకి తీసుకోవచ్చని ఆయనకు స్పష్టమైంది. దీంతో ఆ తూటాతో కాల్చుకొని అమరుడయ్యాడు. ఆజాద్‌ అంటే స్వేచ్ఛ. అందుకు నిదర్శనంగా బ్రిటిషువారికి లొంగకుండా బలిదానం చేసిన మహాత్యాగి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఒకే బుల్లెట్‌...ఎదురుగా పోలీసులు."

Post a Comment