పటేల్‌ జయంతి రోజే కశ్మీర్‌ విభజన తేదీ


అక్టోబరు 31న కేంద్రపాలిత ప్రాంతాలుగా ఆవిర్భవించనున్న జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌


2చోట్లా శాంతిభద్రతలు కేంద్రం పరిధిలోనే


జమ్మూకశ్మీర్‌లో భూమిపై అధికారం ఎన్నికైన ప్రభుత్వానిదే



న్యూఢిల్లీ, ఆగస్టు 11: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి రోజైన అక్టోబరు 31 నుంచి జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించనున్నాయి. ఈమేరకు పార్లమెంటు ఆమోదించిన ‘జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019’కి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం ఆమోదముద్ర వేయగా.. విభజన తేదీ (అపాయింటెడ్‌ డే)ని అక్టోబరు 31గా నిర్ణయిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా ఏర్పడబోయే రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో (జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌) శాంతిభద్రతల అంశం కేంద్రం పరిధిలోనే ఉంటుంది. జమ్మూకశ్మీర్‌లో భూమిపై అధికారం మాత్రం అక్కడ ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటుంది. అంటే.. భూమిపై హక్కులు, భూబదిలీలు, వ్యవసాయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూసే హక్కు, భూరికార్డుల నిర్వహణ తదితరాలన్నీ ఎన్నికైన ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. ఇక, జమ్మూకశ్మీర్‌కు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఉంటారు.

 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పటేల్‌ జయంతి రోజే కశ్మీర్‌ విభజన తేదీ"

Post a Comment