త్రాగునీరు లేక పాఠశాలల్లో పిల్లలకు పలు ఇబ్బందులు..
ఇంటి నీటితోనే నోటిలోకి ముద్ద దిగేది
పాఠశాలల్లో తీవ్ర తాగునీటి ఇబ్బందులు
నిత్యం ఇళ్ల నుంచి సీసాలతో విద్యార్థులు
నిర్వహణ లేక మూలకుచేరిన ఆర్వోప్లాంట్లు
ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. విద్యార్థులు ఇళ్ల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. లేదంటే వారికి గుక్కెడు నీరూ కరవే అవుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి గతంలో దాతలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్వోప్లాంట్లు మెజార్టీ ప్రాంతాల్లో మూలకు చేరాయి. దీనికి ప్రధాన కారణం నిర్వహణలోపమే. పాఠశాలలకు గత కొంతకాలంగా అరకొరగా గ్రాంటు విడుదలవుతోంది. వచ్చిన దానిని ఇతర అవసరాలకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు వినియోగించాల్సి వస్తోంది. దాంతో ఆర్వోప్లాంట్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు పుస్తకాలు, లంచ్బాక్స్లతో పాటు ఒకటి, రెండు లీటర్ల సీసాలతో నీటిని తీసుకువస్తున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వం ఏర్పాటు చేసిన నల్లాలు, దాతలు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన ఆర్వోప్లాంట్లు ఉన్నా అవి సక్రమంగా పనిచేయడం లేదు. గతంలో చాలా పాఠశాలల్లో జలమణి పథకం కింద నీటిశుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అవి లెక్కలకే పరిమితమయ్యాయి. అధికారులు మాత్రం తమ లెక్కల ప్రకారం కేవలం 2% పాఠశాలల్లోనే తాగునీటి సమస్య ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి మూలనపడ్డ ప్లాంట్లను పరిగణనలోకి తీసుకుంటే సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటోంది
ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. విద్యార్థులు ఇళ్ల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. లేదంటే వారికి గుక్కెడు నీరూ కరవే అవుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి గతంలో దాతలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్వోప్లాంట్లు మెజార్టీ ప్రాంతాల్లో మూలకు చేరాయి. దీనికి ప్రధాన కారణం నిర్వహణలోపమే. పాఠశాలలకు గత కొంతకాలంగా అరకొరగా గ్రాంటు విడుదలవుతోంది. వచ్చిన దానిని ఇతర అవసరాలకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు వినియోగించాల్సి వస్తోంది. దాంతో ఆర్వోప్లాంట్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు పుస్తకాలు, లంచ్బాక్స్లతో పాటు ఒకటి, రెండు లీటర్ల సీసాలతో నీటిని తీసుకువస్తున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వం ఏర్పాటు చేసిన నల్లాలు, దాతలు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన ఆర్వోప్లాంట్లు ఉన్నా అవి సక్రమంగా పనిచేయడం లేదు. గతంలో చాలా పాఠశాలల్లో జలమణి పథకం కింద నీటిశుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అవి లెక్కలకే పరిమితమయ్యాయి. అధికారులు మాత్రం తమ లెక్కల ప్రకారం కేవలం 2% పాఠశాలల్లోనే తాగునీటి సమస్య ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి మూలనపడ్డ ప్లాంట్లను పరిగణనలోకి తీసుకుంటే సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటోంది
0 Response to "త్రాగునీరు లేక పాఠశాలల్లో పిల్లలకు పలు ఇబ్బందులు.."
Post a Comment