ఏపీలో సత్యసాయి ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం అందిస్తామని ముందుకు వచ్చిన సత్య సాయి ట్రస్ట్ ప్రతినిధుల ప్రతిపాదన పరిసీలిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. సత్య సాయి ట్రస్ట్ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో మంత్రి సురేష్ తో సమావేశమయ్యారు.
ట్రస్ట్ తరపున ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం ఇస్తామని ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు గా ప్రకాశం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మొదట అమలు చేస్తామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఇందుకు అయ్యే ఖర్చులో సగం ట్రస్ట్ ద్వారా ఇస్తామని, మిగతా సగం ప్రభుత్వం ద్వారా అందజేయాలని కోరారు.
దీనిపై మంత్రి సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యావ్యవస్థ మెరుగుపడేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను పరిశీలిస్తున్నామని అన్నారు
దీనిపై మంత్రి సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యావ్యవస్థ మెరుగుపడేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను పరిశీలిస్తున్నామని అన్నారు
అల్పాహారం విషయంలో ట్రస్ట్ ప్రతినిధుల ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు
0 Response to "ఏపీలో సత్యసాయి ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం."
Post a Comment