మూడు నెలల్లోనే చరిత్ర సృష్టించాం: సీఎం జగన్

💥 మూడు నెలల్లోనే చరిత్ర సృష్టించాం: సీఎం జగన్...

➡ గురువారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ స్టేడియంలో ఏపీ సీఎం జాతీయ జెండా ఎగురవేశారు. 

➡ ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కార్పొరేట్‌ సంస్కృతిని మార్చేందుకు.. పాఠశాల విద్య నియంత్రణ కమిషన్‌ ఏర్పాటు చేశామని సీఎం వెల్లడి. 

➡ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ...4 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించి.. చరిత్ర సృష్టించామని సీఎం జగన్‌ వ్యాఖ్య.

➡ విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. 

➡ ఆరోగ్యశ్రీ ద్వారా పేదల ఆస్పత్రి బిల్లు వెయ్యి దాటితే ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. 

➡ ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2,031 వ్యాధులు చేర్చినట్లు సీఎం తెలిపారు. 

➡ ఉద్యోగులకు 27శాతం ఐఆర్‌ను ఆమలు చేస్తున్నామని, 

➡ సీపీఎస్‌కు బదులు పాత పెన్షన్‌ విధానం అమలుకు చర్యలు తీసుకుంటామని సీఎం వ్యాఖ్య.

➡ ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరేందుకు...గ్రామ వాలంటీర్‌ వ్యవస్థను తీసుకొస్తున్నామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మూడు నెలల్లోనే చరిత్ర సృష్టించాం: సీఎం జగన్"

Post a Comment