స్వాతంత్ర్య దినోత్సవ వేఢుకలకు
ఈనెల 15వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర స్ధాయి 73వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేఢుకల ఏర్పాట్లను రాష్ట్ర డిజిపి గౌతమ్సవాంగ్ శుక్రవారం
పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో డిజిపి మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేఢుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయపతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారన్నారు.
గౌరవ ముఖ్యమంత్రికి వివిధ పోలీస్ దళాలు, స్వౌట్స్ అండ్ గైడ్స్, యన్సిసి కేడిట్స్, ఏపి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ విద్యార్ధినీ విద్యార్ధులు, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కార్యకర్తలు కవాతు ప్రదర్శన ద్వారా గౌరవ వందనాన్ని అందజేస్తారన్నారు
స్వాతంత్ర్య దినోత్సవ వేఢుకలకు రాష్ట్రగవర్నరు, మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, తదితర
ప్రజాప్రతినిధులతోపాటు న్యాయమూర్తులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, పాఠశాల విద్యార్ధినీ, విద్యార్ధులు హాజరవుతారన్నారు. ఏర్పాట్లు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు
0 Response to "స్వాతంత్ర్య దినోత్సవ వేఢుకలకు"
Post a Comment