ఏపీలో 'పెళ్లికానుక' పేరు మార్చిన ప్రభుత్వం

అమరావతి: పథకాల పేర్లు మార్పులో ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లి కానుక పథకం పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 



ఇకపై ఈ పథకాన్ని వైఎస్సార్‌ పెళ్లికానుకగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల పేర్లను మారుస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్‌ భరోసా పథకం పేరును వైఎస్సార్‌ పింఛను కానుకగా,


 మధ్యాహ్న భోజన పథకం పేరును వైఎస్సార్‌ అక్షయపాత్రగా మార్చారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో 'పెళ్లికానుక' పేరు మార్చిన ప్రభుత్వం"

Post a Comment