రాఖీ పౌర్ణమి చరిత్ర ఏంటి..? ఎందుకు జరుపుతారు
సోదరి, సోదరుల అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. పురాతన కాలం నుంచి భారతీయులు దీన్ని సంప్రధాయంగా నిర్వహించుకుంటున్నారు.శ్రావణమాసం పౌర్ణమి నాడు ఈ పండగ జరుపుకుంటారు. ఈ పండగ వెనక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నిజానికి పసుపులో దారాన్ని ముంచి, దాన్ని మూడు పొరలుగా కట్టే రక్షణ ధారమే రక్షా బంధన్.
వేల ఏళ్ల నుంచి మన పురాణాల్లో 'రక్షా బంధన్' గురించి ప్రస్తావన ఉంది. రక్షా బంధన్ భర్తలకు భార్యలు కూడా కట్టేవారు. రాక్షసులతో యుద్దానికి వెళ్లే ముందు ఇంద్రుడికి అతడి భార్య సచీదేవి రక్షణగా రాఖీ కట్టిందని పురాణాలు చెబుతున్నాయి. అదే విధంగా యమలోకాధిపతి యమధర్మరాజు చెల్లెలు కూడా ప్రతి శ్రావణ పౌర్ణమి నాడు రాఖీ కట్టేది
సోదరితోతో ఎవరైనా రాఖీ కట్టించుకుంటే వారికి అమరత్వం లభిస్తుందని చెబుతాడు. అప్పటి నుంచి సోదరి - సోదరులు మాత్రమే రక్షా బంధన్ జరుపుకుంటున్నారు.
చిత్తోర్గఢ్ రాణి కర్ణావతి అప్పటి ఢిల్లీ చక్రవర్తి హుమయూన్కు రాఖీని పంపి గుజరాత్ రాజు బహదూర్ షా దండయాత్రలను నుంచి తమ రాజ్యాన్ని రక్షించాల్సిందిగా కోరిందట. అప్పటి నుంచి రాజస్థాన్ మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఒడిశాలో రాఖీ పండుగను 'గ్రహ్మ పూర్ణిమ' గా.. మహారాష్ట్ర, గుజరాత్, గోవాలలో 'నారియల్ పూర్ణిమ'.. మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, జార్ఖండ్, బీహార్లలో 'కజరి పూర్ణిమ' అని పిలుస్తారు. ఏ ప్రాంతంలో ఏ పేరుతో పిలిచినా సోదర - సోదరి భావనకు ప్రతీకగా ఈ పండగ నిలిచిపోయింది
0 Response to "రాఖీ పౌర్ణమి చరిత్ర ఏంటి..? ఎందుకు జరుపుతారు"
Post a Comment