నకిలీ డిగ్రీల రాకెట్‌పై యుజిసి కమిటి

న్యూఢిల్లీ : దేశంలో కొనసాగుతున్న నకిలీ డిగ్రీల రాకెట్‌ గుట్టు విప్పేందుకు యుజిసి ఒక కమిటీని 



నియమించనున్నది. ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ శుక్రవారం యూనివర్సిటి గ్రాంట్స్‌ కమిషన్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్ధులు తరగతులకు, పరీక్షలకు హాజరయ్యే అవసరం లేకుండానే గుర్తింపు పొందిన యూనివర్సిటీలకు చెందిన డిగ్రీలను అందించే ముఠా ఒకటి దేశ వ్యాప్తంగా పనిచేస్తున్నది. ఈ ముఠా కొంతమంది ఏజెంట్లను నియమించుకుని నకిలీ డిగ్రీలను విద్యార్ధులకు అందచేస్తున్నది. ఈ వ్యవహారంపై మీడియాలో అనేక వార్త కధనాలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై హెచ్‌ఆర్‌డి విచారణ జరపాలని నిర్ణయించుకుని కమిటీ ఏర్పాటు చేయాలని యుజిసిని ఆదేశించింది

యుజిసి నియమించిన కమిటి మూడు వారాలలోగా తన విచారణ నివేదికను అందించాల్సి ఉంటుంది. ఆ నివేదిక ప్రకారం అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నకిలీ డిగ్రీల రాకెట్‌పై యుజిసి కమిటి"

Post a Comment