ఆర్టికల్ 370 అంటే.
దీని ప్రకారం ఇతర రాష్ర్టాల ప్రజలు కశ్మీర్లో స్థిరాస్తులు కొనే అవకాశం ఉండదు. ఆర్టికల్ 370 ప్రకారం కశ్మీర్లో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే అధికారం కూడా కేంద్రానికి ఉండదు. కేవలం యుద్ధం లేదా బాహ్య వత్తిళ్ల వల్ల ఏర్పడే పరిణామాల నేపథ్యంలోనే కశ్మీర్లో ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాష్ట్రంలో ఏవైనా అల్లర్ల చోటుచేసుకుంటే, ఆ సమయంలో ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉండదు.
రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే కేంద్రం ఎమర్జెన్సీని ప్రకటిస్తుంది. అయితే ప్రత్యేక చట్టాల అమలు కోసం తయారైన ఆర్టికల్ 370ని రద్దు చేయాలని బీజేపీ భావిస్తున్నది. దాని కోసమే తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆ వాగ్దానం కూడా చేసింది. 2019లో తిరిగి తాము అధికారంలోకి వస్తే కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని మోదీ అన్నారు
రాష్ట్ర విభజన..
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఉమ్మడి జమ్ముకశ్మీర్ను జమ్ము-కశ్మీర్, లద్దాక్ ప్రాంతాలుగా విభజించారు. వీటిల్లో జమ్ము-కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కాగా.. లద్దాఖ్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించింది.
జమ్ము కశ్మీర్ను దేశంతో అనుసంధానించాం: అమిత్ షా
జమ్ము కశ్మీర్ను తాము మిగిలిన దేశంతో అనుసంధానించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత రాజ్యాంగం మొత్తం జమ్ము కశ్మీర్లో అమలవుతుందన్నారు. మూడు కుటుంబాలు కలిసి జమ్ముకశ్మీర్ను దోచుకొన్నాయన్నారు. ''గులాం నబీ ఆజాద్ చెప్పినట్లు 370 చారిత్రాత్మకం అంటున్నారు.. నేను ఆ విషయంలోకి వెళ్లడంలేదు. నేను చెప్పే అంశాలు చరిత్రాత్మకమైనవి. 370 కారణంగా కశ్మీర్కు చెందిన చాలా కుటుంబాలు అక్కడ దరిద్రంలో జీవిస్తున్నాయి. దీనిని అడ్డం పెట్టుకొని కొన్ని కుటుంబాలు అక్కడి ప్రజలను దోచుకొన్నాయి. మహారాజ హరిసింగ్ చేత భారత్లో కలుపుతూ అంగీకార పత్రంపై సంతకం చేశారు. అప్పట్లో ఆర్టికల్ 370 లేదు. ఆ తర్వాత వచ్చింది. ఆర్టికల్ 370 జమ్ము కశ్మీర్ను భారత్తో మమేకం కానివ్వలేదు. కశ్మీర్ను అడ్డం పెట్టుకొని కొన్ని పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేశాయి. మోదీ ప్రభుత్వానికి ఆ అవసరం లేదు. సభ్యులు అందరూ చర్చించాలి. ఆర్టికల్ 370 వచ్చాకే కశ్మీర్లో అరాచకాలు మొదలయ్యాయి. కశ్మీర్లో దళితులకు రిజర్వేషన్లు దక్కలేదనే విషయం దేశానికి తెలియాలి. కశ్మీర్లోకి వెళ్ళే అత్యధిక నిధులు ఎక్కడి పోతున్నాయో చర్చించాలి. నేను ప్రతి దానికి సమాధానం ఇస్తాను. ఆర్టికల్ 370 తొలగించడంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకూడదు.'' అని అమిత్ షా రాజ్యసభలో పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని హత్య చేశారు..: గులాం నబీ ఆజాద్
కశ్మీర్ కోసం చాలా మంది రాజకీయ నాయకులు, సైనికులు, పలువురు సామాన్యులు ప్రాణాలను అర్పించారు. వీరంతా భారత్తో కలిసి ఉండేందుకే ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశ చరిత్రలో ఓ చీకటి రోజు. కొందరి చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ్యాంగాన్ని దెబ్బతీసే చర్యలను నేను ఖండిస్తున్నాను. నేడు భాజపా రాజ్యాంగాన్ని హత్య చేసింది
0 Response to "ఆర్టికల్ 370 అంటే."
Post a Comment