ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా బిశ్వభూషణ్
బిశ్వభూషణ్ రచయిత కూడా..
బిశ్వభూషణ్ ప్రముఖ న్యాయవాది. జనసంఘ్, జనతా పార్టీలో ఆయన పనిచేశారు. 1971లో భారతీయ జనసంఘ్ ద్వారా బిశ్వభూషణ్ రాజకీయాల్లోకి వచ్చారు. 1977లో జనతాపార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం భాజపాలో చేరిన ఆయన.. 1980 నుంచి 1988 వరకు ఒడిశా భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగానూ ఆయన ఎన్నికయ్యారు.
2004లో బిజద-భాజపా సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బిశ్వభూషణ్ రచయిత కూడా. ఒడియాలో ఆయన పలు గ్రంథాలు రాశారు. మారుబటాస్, రాణా ప్రతాప్, శేషజలక్, అస్తశిఖ, మానసి గ్రంథాలను రాయన రాశారు. సుదీర్ఘమైన రాజకీయ జీవితం కలిగిన బిశ్వభూషణ్ చిలికా, భువనేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించారు
0 Response to "ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా బిశ్వభూషణ్"
Post a Comment