బడ్జెట్లోని కొన్ని ముఖ్యంశాలు
2. వ్యక్తిగత పన్ను మినహాయింపులో ఆదాయ పరిమితి రూ.5 లక్షలకు పెంపు. రూ.2-5 కోట్లు, రూ.5 కోట్లకు పైగా వార్షిక ఆదాయం ఉన్నవారికి వరుసగా 3, 7 శాతాల సర్ఛార్జ్.
3. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఆయా వాహనాలపై విధిస్తున్న జిఎస్టి 12 నుంచి 5 శాతానికి తగ్గింపు. ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేసేందుకు తీసుకున్న లోన్కు రూ.1.5 లక్షల వడ్డీ వరకూ ఆదాయపన్ను మినహాయింపు.
4. గృహ రుణాలపై కొంత ఊరట. మార్చి 31, 2020లోపు ఇళ్లు కొనుగోలు చేసేవారికి ఇస్తున్న వడ్డీ రాయితీ రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంపు.
5. ఎటువంటి ఆలస్యం లేకుండా పాస్పోర్టు ఉన్న ఎన్ఆర్ఐలకు అధార్ కార్డు సౌకర్యం కల్పించే ప్రతిపాదన
. 1, 2, 5, 10 రూపాయల నాణేలతో పాటు కొత్తగా రూ.20 నాణెం.
7. చమురుపై ఎక్సైజ్ సుంకం రూ.1 పెంపు. పెరగనున్న పెట్రోలు, డీజిల్ ధరలు. ఈ ప్రభావం రవాణా రంగంపై పడి నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశం.
8. బంగారంపై కస్టమ్స్ సుంకం 10 నుంచి 12.5 శాతానికి పెంపు.
9. స్టార్టప్ సంస్థలను మరింత ప్రోత్సహించేందుకు ఆయా సంస్థలకు నిధులు సమకూర్చుకునే విషయంలో ఐటి డిపార్ట్మెంట్ పరిశీలన అవసరం లేదని ప్రతిపాదన.
10. బ్యాంకు ఖాతా నుంచి నగదు ఉపసంహరణ పరిమితి ఏడాదికి రూ.కోటి . రూ.కోటి దాటితే 2శాతం టిడిఎస్.
11. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70 వేల కోట్ల మూలధన సాయం.
12. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సంస్థల నుంచి రూ.1.05 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణే ధ్యేయం.
13. స్టార్టప్ సంస్థల ప్రచారానికి కొత్త టివి ఛానల్ ఏర్పాటు.
14. ప్రపంచంలో భారత విద్యావిధానాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు నూతన జాతీయ విధానం. విదేశీ విద్యార్థులను దేశానికి రప్పించడంపై ప్రత్యేక దృష్టి.
15. 2030లోపు రైల్వే శాఖలో మౌలిక సదుపాయాల కోసం రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం.
16. 2022 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి ఎలక్ట్రిసిటీ, వంట గ్యాస్ కనెక్షన్.
17. వ్యవసాయంలో జీరో బడ్జెట్(పెట్టుబడులు లేకుండా) విధానం అమలు. దీనిపై ఇప్పటికే రైతులకు శిక్షణ ఇచ్చామని బడ్జెట్లో ప్రకటన.
18. ప్రధాన మంత్రి కర్మయోగి మాన్ధన్ యోజన ద్వారా చిల్లర వ్యాపారులకు పింఛను పథకం. 3 కోట్ల మంది వరకూ లబ్ధి పొందే అవకాశం. అయితే వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్ల కన్నా తక్కువగా ఉండాలి.
19. ఎంఎస్ఎంఇ సంస్థలు రూ.కోటి వరకూ రుణం పొందే అవకాశం.
20. స్వయం సహాయక బృందాలకు ముద్ర యోజన వర్తింపు. ప్రతి బృందంలో ఒకరికి రూ.లక్ష వరకూ ముద్ర రుణం.
21. 'జల్శక్తి మంత్రిత్వ శాఖ' ఏర్పాటు, అన్ని రకాల నీటి వనరుల నిర్వహణ. 'హర్ ఘర్ జల్' పథకంలో భాగంగా గృహాలకు నీటి సరఫరా.
22. నాలుగు కార్మిక కోడ్ల ఏర్పాటు.
23. త్వరలో భారత్లో ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మిట్ ఏర్పాటుకు
ఆదాయ పన్ను పరిమితిలో మార్పు లేదు
- రూ.లక్షన్నర పెరిగిన గృహ రుణం వడ్డీ రాయితీ
- అధిక ఆదాయ వర్గాలకు పన్ను పోటు
- పెట్రోల్పై వడ్డన
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మధ్యతరగతి వర్గాలకు, ఉద్యోగ వర్గానికి కొంచెం మాత్రమే ఊరట లభించింది. ఆదాయపన్ను పరిమితిని పెంచుతారని మధ్యతరగతి ఆశించినపప్పటికీ అది జరగలేదు. పన్ను కడుతున్న సామన్యులందరికీ కృతజ్ఞతలు చెప్పిన నిర్మలా సీతారామన్ 78 శాతం మేరకు పన్ను రాబడి పెరిగినట్లు చెప్పారు
మొదటిసారిగా ఇల్లు కొనుక్కుంటున్నవారు 45 లక్షల లోపు రుణం తీసుకుంటే లక్షన్నర రూపాయలు అదనంగా వడ్డీ రాయితీ లభిస్తుంది. దీంతో ఇప్పటివరకు ఉన్న రెండు లక్షల రూపాయల వడ్డీ రాయితీ మూడున్నర లక్షలకు పెరగనుంది. ఇప్పటికే స్తబ్దతలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి ఈ నిర్ణయంతో కాస్త కదలిక రావచ్చునని అంటున్నారు. దీంతోపాటు విద్యుత్ వాహనాల కొనుగోలుకు సంబంధించిన రుణాల వడ్డీ విషయంలోనూ బడ్జెట్లో రాయితీలు ప్రకటించారు. కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో విద్యుత్ వాహనాలను ప్రొత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఎవరైనా విద్యుత్ వాహనాలను రుణంపై కొనుగోలు చేసే దాని వడ్డీలో లక్షన్నర రూపాయల వరకు ఆదాయ పన్నులో రాయితీ ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఈటిఎఫ్ల్లో పెట్టుబడులు పెట్టే మధ్యతరగతి ప్రజలకు సెక్షన్ 80 సి కింద లక్షన్నర వరకు ఆదాయ పన్నులో వడ్డీ రాయితీ లభిస్తుంది.
అధిక ఆదాయ వర్గాలకు పన్ను పోటు
ఎగువ మధ్యతరగతిగా భావించే అధిక ఆదాయ వర్గాలపై పన్ను పోటు పడింది. ఏటా రెండు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు సంపాదించే వ్యక్తులపై ఇప్పటి వరకు 15 శాతం సర్ఛార్జ్్ ఉండేది. ఇప్పుడు దాని 25 శాతానికి పెంచారు. ఒక వేళ ఆదాయం ఐదు కోట్లకు మించి పెరిగితే సర్ఛార్జ్్ 15 నుంచి 37 శాతానికి పెరుగుతుంది. అంతే కాక ఏడాదిలో బ్యాంక్ నుంచి కోటి రూపాయలకు మించి నగదును విత్ డ్రా చేస్తే రెండు శాతం టిడిఎస్ చెల్లించాల్సి ఉంటుంది.
పెట్రోల్, బంగారుపై అదనపు బాదుడు
పెట్రోల్, డీజిల్పై బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీని పెంచారు. అంతేకాక సెస్ను కూడా పెంచారు. దీంతో లీటర్కు రెండు రూపాయల చొప్పున ప్రజలపై భారం పడనుంది.
ఇప్పటికే పెట్రో ధరలు అకాశాన్నంటుతుండగా కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయంతో సామాన్యులు మరింత ఇబ్బంది పడే అవకాశముంది. అదే విధంగా బంగారం ధరలు కూడా పెరగనున్నాయి. ఇప్పటివరకు బంగారం, వెండిపై 10 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తుండగా, ఇక నుంచి 12.5 శాతం వరకు విధించాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. దీంతో బంగారం కొనుగోళ్లు సామాన్యులకు భారం కానున్నాయి.
నగదు రహితమే
నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఆర్థిక మంత్రి కొన్ని ప్రతిపాదనలు చేశారు. వార్షిక టర్నోవర్ రూ.50 కోట్లకు మించిన వ్యాపార సంస్థలకు, వాటి వినియోగదారులకూ ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) ఛార్జీలు ఉండవని చెప్పారు. ఈ భారాన్ని ఆర్బీఐ, బ్యాంకులు భరిస్తాయని పేర్కొన్నారు. దీనికి వీలుగా ఆదాయపు పన్ను చట్టానికి, పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007కు అవసరమైన సవరణలు చేస్తామని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల దిశగా భీమ్ యూపీఐ, యూపీఐ క్యూఆర్ కోడ్, ఆధార్ పే, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి ఎన్నో సదుపాయాలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చినట్లు
బ్యాంకులకు 70వేల కోట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇందుకు రూ.70,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీనివల్ల రుణ లభ్యత పెరుగుతుందన్నారు. బ్యాంకుల్లో మొండి బాకీలు తగ్గుతున్నట్లు పేర్కొన్నారు. మొండి బాకీలు రూ.లక్ష కోట్ల మేరకు తగ్గినట్లు వెల్లడించారు. అదే సమయంలో దివాలా చట్టం (ఐబీసీ కోడ్) ద్వారా బ్యాంకులు గత నాలుగేళ్లలో దాదాపు రూ.4లక్షల కోట్ల మొండి బాకీలను వసూలు చేశాయని చెప్పారు. ప్రభుత్వ బ్యాంకుల స్థిరీకరణ చేపట్టినట్లు
ఎక్సైజ్, సేవా పన్ను కేసులకు క్షమాభిక్ష పథకం
వివాదాల పరిష్కార, క్షమాభిక్ష పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 'సబ్కా విస్వాస్ లెగసీ డిస్పూట్ రెసొల్యూషన్ స్కీమ్-2019గా పిలిచే ఈ పథకం వల్ల సేవా, ఎక్సైజ్ సుంకాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న కేసులకు పరిష్కారం లభించనుంది. పన్ను బకాయిని బట్టి 40% నుంచి 70% దాకా ఈ పథకం నుంచి ఊరట పొందే అవకాశం ఉంది. వడ్డీ, అపరాధ రుసుముల నుంచి కూడా ఈ పథకం ద్వారా ఊరట పొందవచ్చు. జీఎస్టీ అమల్లోకి రాకముందు భారీ సంఖ్యలో ఉన్న ఎక్సైజ్, సేవా పన్నులపై కేసులు ఇంకా తేలలేదు. ఈ కేసుల్లో రూ.3.75 లక్షల కోట్లు పైగా చిక్కుకుని ఉన్నాయి. ఈ ఒత్తిడిని తగ్గించి ఆయా వ్యాపారులు ముందుకు వెళ్లడానికి వీలుకల్పించేందుకే ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది
వాటా విక్రయ లక్ష్యం రూ.1,05,000 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్ఈ) వాటా విక్రయం ద్వారా రికార్డు స్థాయిలో రూ.1,05,000 కోట్లు సమీకరించాలని బడ్జెట్లో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ఎయిరిండియా సహా పలు సీపీఎస్ఈల ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రారంభించనుంది. అంతేకాకుండా మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.90,000 కోట్లకు మించి ఇప్పుడు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం గమనార్హం. తాజా వ్యూహాత్మక వాటా విక్రయ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం తన వాటాను 51 శాతం లోపునకు తగ్గించుకోనుంది. పరిమిత వాటాను కలిగి ఉన్నప్పటికీ ఆ సంస్థల నియంత్రణ మాత్రం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. తదనుగుణంగా విధానాల్లో మార్పులు చేయనుంది
నమోదిత కంపెనీలు షేర్లను తిరిగి కొనుగోలు చేసేటప్పుడు 20% బైబ్యాక్ పన్నును చెల్లించాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇంతవరకూ నమోదు కాని కంపెనీలు మాత్రమే ఈ పన్నును చెల్లించేవి. అయితే డివిడెండు పంపిణీ పన్ను (డీడీటీ) ఎగ్గొట్టడానికి చాలా కంపెనీలు బైబ్యాక్ వైపు మొగ్గు చూపుతున్నట్లు గుర్తించడంతో వాటికి కూడా బైబ్యాక్ పన్నును అమలు చేస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కంపెనీలు తాము ఆర్జించే లాభాల్లో కొంతభాగాన్ని వాటాదార్లకు పంచేందుకు వీలుగా డివిడెండ్లు చెల్లిస్తుంటాయి. ఈ సమయంలో అవి ప్రభుత్వానికి డీడీటీని చెల్లించాల్సి ఉంటుంది. అయితే నమోదిత కంపెనీలు ఆ లాభాలతో షేర్ల బైబ్యాక్కు దిగుతుండటంతో బైబ్యాక్ పన్నును అమలు చేసినట్లు తెలుస్తోంది
విద్యుత్తు వాహనాలు కొంటే..లక్షన్నర వరకు రాయితీ
విద్యుత్తు వాహనాల (ఈవీ) కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు.. వాటి నిమిత్తం తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీకి ఆదాయపు పన్నులో రూ.1.50 లక్షల వరకు మినహాయింపు ఇవ్వాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇందువల్ల మొత్తంమీద వినియోగదార్లకు రూ.2.50 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది. అధునాతన బ్యాటరీ కలిగి, రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యుత్తు వాహనాల వినియోగదార్లకే ఇది వర్తిస్తుంది. ఈవీల విడిభాగాలు కొన్నింటిపై కస్టమ్స్ సుంకాన్ని కూడా ప్రభుత్వం పూర్తిగా పరిహరించింది. విద్యుత్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో ఫేమ్ 2 పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అలాగే వీటిపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది
0 Response to "బడ్జెట్లోని కొన్ని ముఖ్యంశాలు"
Post a Comment