నేటి నుంచి ఓటర్ల వివరాల పరిశీలన
- ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ విడుదల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె విజయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం నుంచి ఆగస్టు 31 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల వివరాలను పరిశీలించనుంది. సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకూ బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను తనిఖీ చేయనున్నారు. అక్టోబర్ 15 వరకూ పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఇతర
ప్రక్రియలను చేపట్టి అక్టోబర్ 15న ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేయనున్నారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకూ అభ్యంతరాలను స్వీకరించనున్నారు
నవంబర్ 2, 3, 9, 10 తేదీల్లో ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. డిసెంబర్ 15నాటికి వినతులను పరిష్కరించనున్నారు. డిసెంబర్ 31న మార్పులు, కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల పేర్లు చేర్చి ఓటర్ల జాబితాను ముద్రించనున్నారు. 2020 జనవరిలో తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు
0 Response to "నేటి నుంచి ఓటర్ల వివరాల పరిశీలన"
Post a Comment