ఎస్బీఐ ఏటీఎం క్యాష్ విత్డ్రా నిబంధనలు
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లకు అనేక సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో ఎక్కువగా ఏటీఎం సర్వీసులను ఉపయోగిస్తాం. ఏటీఎం నుంచి డబ్బు తీసుకుంటున్నామంటే.. క్యాష్ విత్డ్రా నిబంధనలు గురించి తప్పక తెలుసుకోవాలి. లేదంటే కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. స్టేట్ బ్యాంక్ కస్టమర్లు ఏటీఎం నుంచి రోజుకు రూ.20,000 విత్డ్రా చేసుకోవచ్చు. అదికూడా ఒక లావాదేవీకి రూ.10,000 చొప్పున తీసుకోవలసి ఉంటుంది. గతంలో ఏటీఎం విత్డ్రా అమౌంట్ లిమిట్ రూ.40,000గా ఉండేది. అయితే బ్యాంక్ తర్వాత ఈ మొత్తాన్ని రూ.20,000 తగ్గించింది. ఇకపోతే ఎస్బీఐ కస్టమర్లు రోజుకు పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్), ఈ-కామర్స్ ప్లాట్పామ్స్పై కార్డు ద్వారా రూ.50,000 వరకు లావాదేవీలు నిర్వహించొచ్చు.
0 Response to "ఎస్బీఐ ఏటీఎం క్యాష్ విత్డ్రా నిబంధనలు"
Post a Comment