26 నుండి డిఎస్‌సి సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ : సంధ్యారాణి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:
డిఎస్‌సి-2018 ప్రొవిజినల్‌ సెలక్షన్‌ జాబితాలో ఉన్న టిడిజి, స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఎ, హిందీ, తెలుగు మినహా) అభ్యర్థుల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ 



కమిషనర్‌ కె సంధ్యారాణి తెలిపారు. జాబితాలో ఉన్న అభ్యర్థుల సెల్‌ఫోన్లకు సమాచారం పంపుతామని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జులై 24, 25 తేదిల్లో సర్టిఫికేట్లను వెబ్‌సైట్‌లో తప్పకుండా అప్‌లోడ్‌ చేయాలని అభ్యర్థులకు సూచించారు. 26,27 తేదిల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు, జులై 28,29 తేదిల్లో టిజిటిలకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని తెలిపారు. నిర్దేశించిన కేంద్రాల్లో అభ్యర్థులు హాజరు కావాలని స్పష్టం చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "26 నుండి డిఎస్‌సి సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ : సంధ్యారాణి"

Post a Comment