ఆ రెండు పథకాలకు జగన్ పేరు
ఈ పథకాలకు జగన్ పేరు పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బుగ్గన వివరించారు. బడికి పంపే పిల్లల తల్లికి
రూ.15వేలు అందించేందుకు ఉద్దేశించిన 'అమ్మ ఒడి' జగన్ రూపకల్పన చేశారు కాబట్టే ఆయన పేరు పెట్టేందుకు తాము ప్రతిపాదించామని బుగ్గన వివరించారు. తొలుత ఆయన నిరాకరించినప్పటికీ తమ ఒత్తిడితో ఆయన అంగీకరించారని తెలిపారు. దీంతో పాటు ఉన్నత విద్యకు సంబంధించి నూరుశాతం ఫీజు
రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యాదీవెన పథకానికీ జగన్ పేరు పెట్టడం గమనార్హం. ఈ పథకం కింద ఆహారం, ప్రయాణం, హాస్టల్, పుస్తకాలు మొదలైన ఖర్చులను భరిచేందుకు రూ.20వేలు చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. ఇందు కోసం ప్రభుత్వం రూ.4,962.3 కోట్లు కేటాయించగా.. అమ్మ ఒడి పథకానికి రూ.6,455 కోట్లను కేటాయించింది
0 Response to "ఆ రెండు పథకాలకు జగన్ పేరు"
Post a Comment