ఏటీఎం లావాదేవీల ఛార్జీలూ మారనున్నాయ్
ఏ బ్యాంకు కార్డుదారులైనా వేరే బ్యాంకు ఏటీఎంలలో లావాదేవీలు జరపొచ్చు. అయితే, వీటి సంఖ్యపై పరిమితి ఉంది. అంతకు మించిన సంఖ్యలో లావాదేవీలు జరిపినప్పుడు కొంతమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ లావాదేవీలపై ఛార్జీల విషయంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్న నేపథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ గురువారం ప్రకటించింది
ప్రస్తుతానికి ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ ఒక నెలలో ఆరు మెట్రో నగరాల్లో తొలి మూడు లావాదేవీలు, ఇతర ప్రాంతాల్లో అయితే ఐదు లావాదేవీలను ఉచితంగా అందిస్తోంది. ఆ తర్వాత ప్రతి నగదు లావాదేవీకి రూ.20 ఛార్జి చేస్తోంది. నగదేతర (బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్) లావాదేవీకి రూ.8.50 ఛార్జీ వసూలు చేస్తోంది. ఎస్బీఐ ప్రతి నగదు లావాదేవీకి రూ.20+ జీఎస్టీ, నగదేతర లావాదేవీకి రూ.8+ జీఎస్టీని వసూలు చేస్తోంది. మరోవైపు నష్టాలకు ఆస్కారం లేకుండా ఛార్జీలను సవరించాలని ఏటీఎం ఇండస్ట్రీ కాన్ఫెడరేషన్ సైతం డిమాండ్ చేస్తోంది.
0 Response to "ఏటీఎం లావాదేవీల ఛార్జీలూ మారనున్నాయ్"
Post a Comment