ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు..?
కెపిఎంజి సర్వే అంచనా
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం లోక్సభలో జులై 5న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఆదాయ పన్ను శ్లాబులు మారే అవకాశం ఉందని కెపిఎంజి అనే ఆర్థిక సంస్థ అంచనా వేస్తోంది. కనీస పన్ను మినహాయింపు శ్లాబ్ 2.5 లక్షల నుంచి పెరిగే అవకాశం ఉందని తన సర్వేలో వెల్లడించింది.
సంవత్సర ఆదాయం రూ.10 లక్షలు దాటిన వారికి ఇప్పుడు విధిస్తున్న 30 శాతం పన్ను 40 శాతానికి చేరుకుంటుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. ఇందుకు గానూ ఈ సంస్థ 2019-20 బడ్జెట్పై ముందస్తు సర్వే నిర్వహించింది. పారిశ్రామిక రంగానికి చెందిన 226 మందిని దీనిపై విచారించగా, 74 శాతం మంది పన్ను విధించేందుకు కనీస ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షల నుంచి పెంచే అవకాశం ఉందని చెప్పారు. ఆదాయం రూ.10 లక్షలకు పైగా పొందుతున్న వారికి రానున్న కాలంలో 40 శాతం పన్ను విధించే సూచనలు ఉన్నాయని 58 శాతం మంది పేర్కొన్నారు
ఏడాదికి రూ.10 కోట్లకు పైగా ఆదాయం సంపాదించేవారిని కేంద్రప్రభుత్వం 'సూపర్ రిచ్'గా నిర్ణయించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న వారిలో 13 శాతం మంది కేంద్ర ప్రభుత్వం వారసత్వ పన్నును తిరిగి తీసుకొస్తుందని, సంపద/ఎస్టేట్ పన్నును తిరిగి అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని 10 శాతం మంది చెప్పారు.
గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు గృహ రుణాలకు బడ్జెట్లో పన్ను మినహాయింపు పరిమితులను మరింత పెంచే అవకాశం ఉందని 65 శాతం మంది పేర్కొన్నారు. మొదటిసారిగా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యక్ష పన్నుల విభాగంలో పెద్దగా మార్పులు చేయకపోవచ్చని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఇండిస్టీ ఛాంబర్స్, పరిశ్రమలు డిమాండ్ చేస్తున్న విధంగా కార్పొరేట్ టాక్స్ను 25 శాతానికి తగ్గించే అవకాశం ఎంతమాత్రం లేదని సర్వేలో పాల్గొన్న వారిలో 46 శాతం మంది
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం లోక్సభలో జులై 5న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఆదాయ పన్ను శ్లాబులు మారే అవకాశం ఉందని కెపిఎంజి అనే ఆర్థిక సంస్థ అంచనా వేస్తోంది. కనీస పన్ను మినహాయింపు శ్లాబ్ 2.5 లక్షల నుంచి పెరిగే అవకాశం ఉందని తన సర్వేలో వెల్లడించింది.
సంవత్సర ఆదాయం రూ.10 లక్షలు దాటిన వారికి ఇప్పుడు విధిస్తున్న 30 శాతం పన్ను 40 శాతానికి చేరుకుంటుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. ఇందుకు గానూ ఈ సంస్థ 2019-20 బడ్జెట్పై ముందస్తు సర్వే నిర్వహించింది. పారిశ్రామిక రంగానికి చెందిన 226 మందిని దీనిపై విచారించగా, 74 శాతం మంది పన్ను విధించేందుకు కనీస ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షల నుంచి పెంచే అవకాశం ఉందని చెప్పారు. ఆదాయం రూ.10 లక్షలకు పైగా పొందుతున్న వారికి రానున్న కాలంలో 40 శాతం పన్ను విధించే సూచనలు ఉన్నాయని 58 శాతం మంది పేర్కొన్నారు
ఏడాదికి రూ.10 కోట్లకు పైగా ఆదాయం సంపాదించేవారిని కేంద్రప్రభుత్వం 'సూపర్ రిచ్'గా నిర్ణయించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న వారిలో 13 శాతం మంది కేంద్ర ప్రభుత్వం వారసత్వ పన్నును తిరిగి తీసుకొస్తుందని, సంపద/ఎస్టేట్ పన్నును తిరిగి అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని 10 శాతం మంది చెప్పారు.
గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు గృహ రుణాలకు బడ్జెట్లో పన్ను మినహాయింపు పరిమితులను మరింత పెంచే అవకాశం ఉందని 65 శాతం మంది పేర్కొన్నారు. మొదటిసారిగా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యక్ష పన్నుల విభాగంలో పెద్దగా మార్పులు చేయకపోవచ్చని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఇండిస్టీ ఛాంబర్స్, పరిశ్రమలు డిమాండ్ చేస్తున్న విధంగా కార్పొరేట్ టాక్స్ను 25 శాతానికి తగ్గించే అవకాశం ఎంతమాత్రం లేదని సర్వేలో పాల్గొన్న వారిలో 46 శాతం మంది
0 Response to "ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు..?"
Post a Comment