బడి ఏదైనా 'అమ్మ ఒడి♦ప్రైవేటు పాఠశాలలకూ వర్తిస్తుంది*
*📚✍బడి ఏదైనా 'అమ్మ ఒడి'*
*24 June 2019, 3:10 am*
*♦ప్రైవేటు పాఠశాలలకూ వర్తిస్తుంది*
*♦సాయం తల్లులకే కానీ స్కూళ్లకు కాదు*
*♦అక్షరాస్యతను పెంపొందించడమే లక్ష్యం*
*♦విద్యాహక్కు చట్టంతో ముడిపెట్టొద్దన్న సీఎం*
*♦తెల్ల రేషన్కార్డే అర్హత ప్రాతిపదిక?*
*♦కుటుంబంలోని పిల్లలందరికీ ఇస్తారా?లేక... గరిష్ఠంగా ఒక్కరికే వర్తిస్తుందా!*
*♦విధి విధానాలపై మరికొన్నాళ్లకు స్పష్టత*
*♦వార్డు వలంటీర్ల ఉత్తర్వులు విడుదల*
*♦నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ*
*♦'అమ్మ ఒడి' ఎవరికి?*
*🔺పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించే తల్లులకు మాత్రమేనా? లేక... ప్రైవేటు పాఠశాలలకు పంపించినా వర్తిస్తుందా? ఈ సందేహాలు, సందిగ్ధతను ప్రభుత్వమే తొలగించింది. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలతో సంబంధంలేకుండా... పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ 'అమ్మ ఒడి' వర్తిస్తుందని స్పష్టం చేసింది.*
🌻అమరావతి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): అమ్మ ఒడి పథకంపై ఎలాంటి సందేహాలు, అపోహలు అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. ''పేద తల్లులు వారి పిల్లల్ని ఏ బడికి పంపినా ఇది వర్తిస్తుంది. దీని గురించి సీఎం జగన్మోహన్రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు. జాతీయ స్థాయిలో నిరక్షరాస్యత 26 శాతం కాగా... ఏపీలో అది 33 శాతం ఉంది. అక్షరాస్యతలో ఏపీ అట్టడుగున ఉంది. ఈ పరిస్థితిని మార్చి పేదల పిల్లలు ప్రతి ఒక్కరూ బడికి వెళ్లి చదువుకోవాలన్న ఉద్దేశంతో, ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది'' అని ఈ ప్రకటనలో స్పష్టం చేశారు. 'అమ్మ ఒడి' అమలు తీరుపై సందేహాలు రావడానికి కారణమేమిటని సీఎం కార్యాలయం ఆరా తీసినట్లు తెలిసింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి.. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే అమ్మ ఒడి అమలవుతుందని, ప్రైవేటు బడులకూ వర్తింప చేయడంపై తర్వాత ఆలోచిస్తామని ఇటీవల తెలిపారు. విద్యారంగ నిపుణులు, సంఘాల వారు కూడా ఈ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకే వర్తింప చేయాలని కోరారు.
🌻ఈ నేపథ్యంలో పథకంపై స్పష్టత ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కార్యాలయమే ఆదివారం స్వయంగా ప్రకటన విడుదల చేసింది. 'పేదల పిల్లలు' అని ఈ ప్రకటనలో స్పష్టంగా ఉంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు అర్హత ప్రాతిపదిక.. తెల్ల రేషన్ కార్డే! 'అమ్మ ఒడి'కి కూడా ఇదే వర్తిస్తుందని తెలుస్తోంది. దీనికి తోడు మరికొన్ని నిబంధనలూ పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యాహక్కు చట్టానికి అనుగుణంగా... ప్రతి పాఠశాలలో 25శాతం సీట్లను పేదలకు కేటాయించే ప్రైవేటు స్కూళ్లకే పథకం వర్తింపచేయాలని ప్రతిపాదించగా దీనికి ముఖ్యమంత్రి ఏకీభవించలేదని తెలిసింది. ''కష్టపడి తమ పిల్లలను చదివించుకుంటున్న తల్లులకు ఈ పథకం కింద సాయం చేస్తున్నాం. అంతేతప్ప ప్రైవేటు స్కూళ్లకు కాదు. విద్యాహక్కు చట్టం నిబంధన అమలయ్యేలా చేద్దాం! అంతే తప్ప.. అమ్మ ఒడితో దానికి ముడిపెట్టవద్దు'' అని జగన్ పేర్కొన్నట్లు తెలిసింది.
*♦తల్లా... పిల్లలా?*
జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకం కింద తల్లులకు సాయం అందించనున్నారు. ఆలోపే లెక్కలు సిద్ధం చేసుకుని, అవసరమైన నిధులు సమీకరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు పాఠశాలకు వెళ్తుంటే ఏం చేస్తారు? తల్లి తన ఇద్దరు పిల్లలను బడికి పంపిస్తుంటే... 30 వేలు ఇస్తారా? లేక... గరిష్ఠంగా ఒక్కరిని మాత్రమే పరిగణనలోకి తీసుకుని రూ.15వేలు మాత్రమే ఇస్తారా? ఈ అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. నిజానికి, జగన్ తన పాదయాత్రలో తొలుత హామీ ఇచ్చినప్పుడు అమ్మ ఒడి పథకం కింద ప్రతి నెలా కొంత మొత్తం ఇస్తామని, కుటుంబంలో ఇద్దరు పిల్లల వరకు దీన్ని వర్తింప చేస్తామని ప్రకటించారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదివే పిల్లలైతే నెలకు రూ.500లు, ఐదు నుంచి పదో తరగతి పిల్లలకు నెలకు రూ.750 చొప్పున ఇద్దరు పిల్లలకు... వర్తింపజేస్తామన్నారు. అయితే, ఆ తర్వాత ఈ మొత్తాన్ని పెంచారు.
🌻ఏటా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి రూ.15వేలు ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పారు. ఇది తొలుత ప్రకటించిన దానికంటే ఎక్కువ మొత్తమే. అయితే ఒకరిని పంపినా, ఇద్దరిని పంపినా... ఇదే మొత్తమా? లేకుంటే పిల్లలను బట్టి ఉంటుందా? అన్నదాని విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. విద్యాశాఖ లెక్కల ప్రకారం ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న పిల్లలు రాష్ట్రంలో 70లక్షల మంది ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు నిబంధన పెడితే ధనవంతులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ పథకం వర్తించదు. మిగిలిన పేద పిల్లలనే తీసుకున్నా... సుమారు 55లక్షలపైనే ఉంటారు. వీరందరికీ పథకం వర్తింప చేయడమా... కుటుంబానికి ఒకరికే వర్తింప చేయడమా? ఇతర విధి విధానాలు ఎలా ఉండాలి? ఈ అంశాలన్నింటిపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Response to "బడి ఏదైనా 'అమ్మ ఒడి♦ప్రైవేటు పాఠశాలలకూ వర్తిస్తుంది*"
Post a Comment