ఇంటర్ మధ్యాహ్న భోజనం బంద్
- 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని
- 2 లక్షల మందికి శరాఘాతం
- సీఎం వ్యాఖ్యలతో తక్షణమే కదిలిన యంత్రాంగం
అమరావతి, కడప, జూన్ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ఇకపై మధ్యాహ్న భోజనం ఉండదు. విద్యాశాఖపై గురువారం నిర్వహించిన సమీక్షలో మధ్యాహ్న భోజన పథకం అమలు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు... 'ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్న భోజనం అవసరం లేదు కదా' అని ముఖ్యమంత్రి జగన్ అనడంతో వాటినే ఆదేశాలుగా భావించిన ఇంటర్మీడియట్ విద్యా కమిషనరేట్ తక్షణమే స్పందించి చర్యలకు ఉపక్రమించింది
ఇదీ నేపథ్యం
గత విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్తరించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కాగా, యథాతథంగానే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్ల ఇంటర్మీడియట్ను చదువుతున్న విద్యార్థులు దాదాపు 10లక్షల మంది వరకూ ఉన్నారు. వీరిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం అమలు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయమే భోజన క్యారియరు తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న సంగతి గుర్తించి అమలు చేసింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీ ఒకే ప్రాంగణంలో ఉంటే... అక్కడే ఇంటర్ విద్యార్థులకు కూడా ప్రధానోపాధ్యాయుల ద్వారా భోజనం అందించే ఏర్పాటు చేశారు
0 Response to "ఇంటర్ మధ్యాహ్న భోజనం బంద్"
Post a Comment