టెన్త్‌లో ఇంటర్నల్‌ తొలగింపు

_*📚✍టెన్త్‌లో ఇంటర్నల్‌ తొలగింపు*_


*♦ప్రభుత్వ కీలక నిర్ణయం*


*♦ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు* 


*🌻విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:* పదో తరగతి పరీక్షలకు ఇక నుంచి అంతర్గత మూల్యాంకనం (ఇంటర్నల్‌ మార్కులు) తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన విధానం అమలులోకి రానుంది. నూతన విద్యామంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం పదవీబాధ్యతల స్వీకరణ సందర్భంగా ఈ మేరకు ప్రకటించారు. కొత్త నిబంధనలతో పదో తరగతి విద్యార్థులకు ఇంటర్నల్‌ మార్కులు ఉండబోవని తెలిపారు. 2018-19 విద్యా సంవత్సరం వరకు 6 నుంచి 10 తరగతులకు సబ్జెక్టుకు 20 చొప్పున ఇంటర్నల్‌ మార్కులు ఉండేవి. 



మిగిలిన 80 మార్కులకు థియరీ పేపర్‌ ఉంటుంది. హిందీ సబ్జెక్టు మినహా అన్నింటికి రెండు పేపర్లు ఉండేవి. పేపర్‌-1లో 30మార్కుల థియరీ, 10 మార్కుల (20 ప్రశ్నలు-ప్రతి ప్రశ్నకు అర మార్కు)కు బిట్‌ పేపర్‌ ఉండేవి. పేపర్‌-2లోనూ 30 మార్కులు థియరీ, 10 మార్కులకు బిట్‌ పేపర్‌ ఇచ్చేవారు. ప్రతి సబ్జెక్టుకు 80 మార్కులతో ఉన్న ప్రశ్నాపత్రాన్ని రూపొందిం చేవారు. టెన్త్‌ ఫలితాల్లో థియరీ, ఇంటర్నల్‌ మార్కుల స్కోరింగ్‌ చూపేవారు. 2019-20 విద్యాసంవత్సరం నుంచి సబ్జెక్టుకు 100 మార్కులకుగాను ప్రశ్నాపత్రం రూపొందిస్తారు. దేశవ్యాప్తంగా సీబీఎస్‌సీ ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని అమలు కానుంది. రాష్ట్రంలో రద్దు చేయడం వల్ల విద్యా ప్రమాణాలు, ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేదీ ప్రశ్నార్థకంగా మారింది. అయితే, కార్పొరేట్‌, ప్రైవేటు యాజమాన్యాలు సిండికేట్‌గా మారి పరస్పరం ఇంటర్నల్‌ మార్కులకు సహకరించుకుంటున్నట్లు ప్రచారముంది.


*♦బిట్‌పేపర్‌ ఉండదా?*

టెన్త్‌లో బిట్‌పేపర్‌ తొలగింపుపై స్పష్టత లేదు. ప్రశ్నాపత్రంలోనే బిట్‌ పేపర్‌ను కలిసి ఇస్తారని తెలిసింది. బిట్‌ పేపర్‌ తొలగిస్తే హిందీ సబ్జెక్టులో గ్రామీణ విద్యార్థులకు స్కోరింగ్‌ తగ్గే అవకాశముంది. దీనికి సంబంధించి ఉపాధ్యాయ సంఘాలు, విద్యానిపుణులతో ప్రభుత్వం చర్చించాల్సిన అవసరముంది.


🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "టెన్త్‌లో ఇంటర్నల్‌ తొలగింపు"

Post a Comment