పాఠశాలల పై విద్యామంత్రి సమీక్ష పూర్తి వివరాలు
- విద్యా ప్రమాణాల పెంపునకు త్వరలో బోర్డు
- రేపటి నుంచి 15 వరకు 'రాజన్న బడిబాట'
- వచ్చే జనవరి 26న 'అమ్మ ఒడి' ప్రారంభం
- పిల్లల్ని బడికి పంపే తల్లికి అదేరోజు 15 వేలు
- క్లస్టర్ కిచెన్ల ద్వారా పిల్లలకు మధ్యాహ్న భోజనం
- విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడి
అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి):ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ కోసం 'ఫీ రెగ్యులేటరీ కమిషన్'ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు
ప్రతి 20 వేల మందికి ఒక సెంట్రలైజ్డ్ క్లస్టర్ ద్వారా వేడివేడి భోజనం అందేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల ఏజన్సీలకు కాకుండా మన రాష్ట్ర ఏజన్సీలకే ఈ బాధ్యత అప్పగిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల నిమిత్తం మరో నాలుగు రోజుల్లో ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్నారు. ఆగస్టు 10 నాటికి ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడి అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. విద్యావ్యవస్థ, విద్యాశాఖలను సమూలంగా ప్రక్షాళన చేస్తామన్నారు.
పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి రహితం అనే మూడు అంశాల ప్రాతిపదికగా రూపొందిన మేనిఫెస్టోను విద్యాశాఖలో పక్కాగా అమలుకు కృషి చేస్తామని చెప్పారు. విద్యార్థుల్లో నైప్యుణ్యాలు పెంచడం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు.
ప్రస్తుతం ఉన్న పాఠశాలల యథాస్థితిని ఫొటోలు తీసి, వాటిని మరమ్మతులు చేయించిన తర్వాత మళ్లీ ఫొటోలు తీసి ఎలా మారాయనేది వివరిస్తామన్నారు. విశ్వవిద్యాలయాలతో పాటు విద్యాశాఖలో అవసరమైన మేరకు ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు
0 Response to "పాఠశాలల పై విద్యామంత్రి సమీక్ష పూర్తి వివరాలు"
Post a Comment