కేంద్ర బడ్జెట్ : ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచడం కోసం తీసుకునే చర్యల్లో భాగంగా ఆదాయపు పన్ను చెల్లించదగిన ఆదాయం పరిమితిని రూ.2,50,000 నుంచి రూ.3,00,000కు పెంచేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై తుది నిర్ణయం ఇంకా జరగలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఐదేళ్ళ కనిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో 5.8 శాతం వృద్ధితో ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. పన్ను మినహాయింపులు ఇవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహకరంగా ఉంటుంది
పన్ను చెల్లించదగిన ఆదాయం పరిమితిని రూ.50 వేలు పెంచడం వల్ల ఒక్కొక్క పన్ను చెల్లింపుదారుకు రూ.2,500 మిగులుతాయి. మన దేశంలో 5 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు
0 Response to "కేంద్ర బడ్జెట్ : ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు శుభవార్త"
Post a Comment