నూతన విద్యా విధానం ముసాయిదా పై విస్తృతంగా చర్చ జరగాలి

*నూతన విద్యా విధానం ముసాయిదా పై విస్తృతంగా చర్చ జరగాలి*



*కేంద్ర  ప్రభుత్వం ఏర్పడినవెంటేనే  మానవ వనరుల శాఖ నూతన విద్యా విధానం ముసాయిదా ను విడుదల చేసింది.

 ఈ ముసాయిదా ను  విద్యా శాఖ వెబ్సైట్ లో  పెట్టి మరియు https://innovate.mygov.in/new-education-policy-2019/  ద్వారా అభిప్రాయం ప్రభుత్వం కోరుతుంది.


పై విధానం అందరికీ అందుబాటులో ఉండదు.ఇంటర్నెట్ ద్వారా మెయిల్ ద్వారా అభిప్రాయం సేకరణ తో పాటు వివిధ స్థాయిలలో విస్తృతంగా చర్చ జరగాలి.


484 పేజీల ముసాయిదా లో విద్యావ్యవస్థ కు సంబంధించి అనేక అంశాలలో ఉన్న లాభ నష్టాల పై అభిప్రాయం తెలిపేందుకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల మాధ్యమాల ద్వారా అభిప్రాయ సేకరణ చేయాలి.తెలుగు భాషలో ముసాయిదా ప్రతిని విడుదల చేయాలి.


సలహాలు ,సూచనలు స్వీకరణకు కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలి. ముసాయిదా లో అంతర్గతంగా ఉన్న ప్రభుత్వ ఉద్దేశ్యం ను అర్ధం చేసుకోనియెడల తీవ్ర మూల్యం చెల్లించుకోకతప్పదు.


తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక ఉపాధ్యాయ సంఘాలు,మేధావులు నూతన విద్యా విధానం పై తమ అభిప్రాయాలను తెలియజేయవలిసిన అవసరం ఉంది. ప్రతీ ఒక్కరి అభిప్రాయం కేంద్ర ప్రభుత్వం కు సకాలంలో చేరాలి. 

CLICK HERE TO ONLINE SUGGESTIONS

భారత సమగ్రాభివృద్ధికి  తోడ్పాటు చేసే విద్యావిధానం కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయవలిసిన అవసరం ఉంది. ఒక్క సారి చట్టసభల్లో బిల్లు ఆమోదం పొందిన తరువాత చర్చించే బదులు ముందుగానే మేల్కోవాలి*.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నూతన విద్యా విధానం ముసాయిదా పై విస్తృతంగా చర్చ జరగాలి"

Post a Comment