ఉద్యోగుల బదిలీలకు గ్రీన్సిగ్నల్ జూలై 5 నుంచి నెలరోజులపాటు నేడో రేపో ఉత్తర్వులు
- జూలై 5 నుంచి నెలరోజులపాటు
- నేడో రేపో ఉత్తర్వులు
సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసి సీఎం సంతకం కోసం పంపించారు.
నిషేధాన్ని సడలిస్తూ ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. సాధారణంగా వేసవి సెలవుల సమయంలో బదిలీలు చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది.
అయితే ఈసారి ఎన్నికలు అడ్డురావడంతో బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా క్షేత్రస్థాయి వరకూ పలువురు అధికారులను బదిలీ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.
దీంతో నెలరోజులపాటు నిషేధం సడలించాలని నిర్ణయించారు. అయితే బదిలీలు పరిమితంగా ఉంటాయా, పూర్తిస్థాయిలో ఉంటాయా అనేదానిపైౖ స్పష్టత రావాల్సి ఉంది.
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అయినందున తన అభీష్టం మేరకు అధికారులు, ఉద్యోగుల నియామకాలు ఉండాలని భావించే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలోనే బదిలీలు ఉండొచ్చని తెలుస్తోంది.
Thanks to all the union leaders.. Especially we are very much thankful to DS sir.. President PRTU Krishna
ReplyDeleteKasi nalla 9440873077