పాఠశాలల్లో అల్పహారం కేంద్రానికి లేఖ రాసిన విద్యాశాఖ
పాఠశాలల్లో అల్పహారం
*📚✍పాఠశాలల్లో అల్పాహారం*
*♦కేంద్ర ప్రాజెక్టు అనుమతుల బోర్డు ఆమోదం*
*🌻ఈనాడు, అమరావతి:* వెనకబడిన జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం అందించేందుకు పాఠశాల విద్యాశాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రాజెక్టు అనుమతుల బోర్డు (పీఏబీ) ఆమోదం తెలిపింది. అల్పాహారంతో పాటు మధ్యాహ్నభోజనానికి రూ.566 కోట్లు కేటాయించింది. అన్ని పథకాలకు కలిపి సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలికి రూ.2,500 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. సోమవారం దిల్లీలో నిర్వహించిన పీఏబీ సమావేశంలో రాష్ట్రం నుంచి పంపిన ప్రతిపాదనలపై చర్చించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వెనకబడిన జిల్లాల్లోని విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు అల్పాహారాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నభోజనం, ఐదు కోడిగుడ్లు ఇవ్వడం, పర్యవేక్షణ విధానాన్ని పీఏబీ అధికారులు గుర్తించి విద్యాశాఖ అధికారులను అభినందించారు. ఈ ఏడాది పాఠశాలల్లో విద్యార్థులతో ఎకోక్లబ్బుల ఏర్పాటు, శహగునోత్సవం కార్యక్రమాల్ని కొత్తగా ప్రారంభించనున్నారు. ఎకోక్లబ్బుల కింద పర్యావరణం, మొక్కల పెంపకం, వ్యర్థాల నిర్వహణ చేపట్టనున్నారు. వీటికి ప్రత్యేకంగా బడ్జెట్ను కేటాయించనున్నారు. శహగునోత్సవం కింద రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించనున్నారు. కేంద్రం రూపొందించిన యాప్లో ఉత్తమ విధానాలను నమోదు చేస్తారు. రాష్ట్రంలో కొత్తగా 16 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
కేంద్రానికి లేఖ రాసిన విద్యాశాఖ
అనుమతించిన కేంద్ర బోర్డ్
యండియం నిధులు మంజూరు
పూర్తి వివరాలు
దిగుమతి చేసుకోండి
సివిప్రసాద్
0 Response to "పాఠశాలల్లో అల్పహారం కేంద్రానికి లేఖ రాసిన విద్యాశాఖ"
Post a Comment