ముస్లిం యువతకు ఉచిత సివిల్స్‌ శిక్షణ దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు

🔳ముస్లిం యువతకు ఉచిత సివిల్స్‌ శిక్షణ దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు

Posted On: Sunday,May 19,2019


ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :

            హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ముస్లిం యువతీ యువకులకిచ్చే ఉచిత సివిల్స్‌ శిక్షణకు దరఖాస్తుల గడువు సోమవారం (మే 20)తో ముగియనుంది. ఆసక్తి ఉన్న వారు సోమవారంలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ఎపి స్టేట్‌ హజ్‌ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అల్హాజ్‌ ఎస్‌ఎండి తాజుద్దీన్‌ ఆరీఫ్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ అర్హత కలిగిన ముస్లిం యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న వారికి జూన్‌ 16న పరీక్షను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్‌ 29, 30 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూలు పూర్తయిన పది రోజుల్లో తుది ఫలితాలు ప్రకటిస్తామని హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మక్సూద్‌ అహ్మద్‌ ఖాన్‌ తెలిపినట్లు తాజుద్దీన్‌ వెల్లడించారు. మరిన్ని వివరాలకు www. hajcommittee.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

CLICK HERE TO OFFICIAL WEBSITE


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ముస్లిం యువతకు ఉచిత సివిల్స్‌ శిక్షణ దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు"

Post a Comment