ఉమ్మడి సర్వీసు నిబంధనల అమలుకు మార్గం సుగమం చేసిన సుప్రీంకోర్టు* *రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి పదోన్నతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి

*🔥ఉమ్మడి సర్వీసు నిబంధనల అమలుకు మార్గం సుగమం చేసిన సుప్రీంకోర్టు*

*రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి పదోన్నతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి🔥*



*🌀ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల అమలుకు వీలుగా 2017 జూన్ 23న కేంద్ర ప్రభుత్వ గెజిట్ ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ ఉత్తర్వులు విడుదల చేసింది.*


*🌀ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించి స్టేటస్కో ఉత్తర్వులు పొందారు. దాదాపు సంవత్సరం తర్వాత  2018 ఆగస్ట్ మొదటి వారంలో విచారణకు వచ్చింది. సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం తీర్పును రిజర్వు చేసి ఆగస్టు 28న రాష్ట్ర పతి ఉత్తర్వులు చెల్లవంటూ తీర్పు వెలువరించింది.*


*🌀రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నవంబరులో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. ఈ రోజు(సోమవారం) ఉదయం కేసు విచారణకు రాగా హైకోర్టు తీర్పును నిలుపుదల చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.*


*🌀సుప్రీం కోర్టు ఆదేశాల పట్ల  హర్షం . రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలు రూపొందించి సహజ న్యాయం, సమాన న్యాయం ప్రాతిపదికన అర్హులైన ఉపాధ్యాయులందరికీ పదోన్నతుల కల్పనకు చర్యలు 

కు శ్రీకారం చుట్టాల్సిఉంది

*🌀ఎంఈఓ, డిప్యూటీ ఈఓ, శిక్షణ కళాశాలల్లోని అధ్యాపకుల ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేసి విద్యారంగంలో నెలకొన్న సంక్షోభానికి ముగింపు  

పలకాల్సిఉంది

CVPRASAD

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉమ్మడి సర్వీసు నిబంధనల అమలుకు మార్గం సుగమం చేసిన సుప్రీంకోర్టు* *రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి పదోన్నతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి"

Post a Comment