త్రిబుల్ ఐటీ లో ప్రవేశాలకు ప్రకటన - పూర్తి వివరాలు
వేంపల్లె,నూజివీడు పట్టణం, న్యూస్టుడే : ట్రిపుల్
ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి
ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ
ప్రకటనలో తెలిపారు.
*ఏ ఏ కేంద్రాలలో ప్రవేశాలు*
ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న
నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు
ట్రిపుల్ ఐటీ కళాశాలలో 2024-25 విద్యా
సంవత్సరానికి ప్రవేశాలకు ఈ నెల 6న నోటిఫికేషన్
విడుదల చేసినట్లు తెలిపారు.
*ఆన్లైన్ దరఖాస్తులు*
ఈనెల 8 ఉదయం 11 గంటల నుంచి జూన్ 25 వరకు ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో లేదా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
*AP RGUKT IIIT 2024 కోసం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి?*
rgukt.inలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అధికారిక వెబ్సైట్ను https://www.rgukt.in/# సందర్శించండి.
ఇప్పుడు హోమ్పేజీలో అడ్మిషన్స్ 2024 లింక్ను కనుగొనండి
సెషన్ 2024-25 కోసం దరఖాస్తు లేదా B.Tech కోర్సులు అని లింక్పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ ఇమెయిల్ చిరునామా మరియు ఫోన్ నంబర్ని ఉపయోగించి మిమ్మల్ని మీరు నమోదు చేసుకోండి
మీ నమోదిత ఇమెయిల్ చిరునామాను ఉపయోగించి లాగిన్ చేసి, ఫారమ్ను పూరించడం ప్రారంభించండి.
మీ వ్యక్తిగత వివరాలు మరియు విద్యార్హతలను నమోదు చేయండి.
ఫోటోగ్రాఫ్లు మరియు మార్క్ షీట్ల వంటి ఫార్మాట్లలో అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి
దరఖాస్తు రుసుమును సమర్పించండి మరియు ధృవీకరించిన తర్వాత సమర్పించు ట్యాబ్పై క్లిక్ చేయండి.
AP IIIT 2024 కోసం భవిష్యత్తు సూచన కోసం నిర్ధారణ పేజీ యొక్క కనీసం రెండు ప్రింట్అవుట్లను తీసుకోండి
*ఆన్లైన్ దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు*
1) 4 నుంచి 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్లు
2)10వ తరగతి TC
3)10వ తరగతి మార్కుల మెమో
4) విద్యార్థి ఆధార్ కార్డు
5) తల్లిదండ్రుల ఆధార్ కార్డు
6) 5 పాస్ ఫోటోలు (విద్యార్థి మరియు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు)
7) రేషన్ కార్డు
8) కుల ఆదాయం మరియు జనన ధృవీకరణ పత్రం
ఎవరికైనా సందేహాలు ఉంటే ✅ యూనివర్సిటీ వెబ్సైట్ www.rgukt.inని తనిఖీ చేయండి
*ధ్రువపత్రాల పరిశీలన*
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలు జూలై ఒకటో తేదీ నుంచి 5 వరకు నూజివీడు క్యాంపస్లో పరిశీలన చేస్తామన్నారు.
*తుది ఫలితాలు*
పరిశీలన అనంతరం జులై 11న ఫలితాలు
ప్రకటిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులందరికీ జులై
మూడో వారంలో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
*ప్రవేశ సీట్ల వివరాలు*
ఒక్కో క్యాంపస్కు 1,000 సీట్లు, ఆర్థికంగా
వెనుకబడిన సామాజిక వర్గాలకు 100 సీట్లు
అందించనున్నట్లు చెప్పారు.
*ఫీజుల వివరాలు*
పీయూసీకి ట్యూషన్ ఫేజు ఒక్కో ఏడాదికి రూ.45 వేలు, బీటెక్ ప్రోగ్రాంకు ఏడాదికి రూ.50 వేలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కాకుండా ఇతర
రాష్రాల అభ్యర్థులకు 25 శాతం సూపర్ న్యూమరీ
సీట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఈ అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.1.50
లక్షలుగా నిర్ణయించామన్నారు. పదో తరగతిలో
సాధించిన మార్కుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ నియమావళి
అనుసరించి సీట్లు కేటాయిస్తామన్నారు.
*ఇతర అంశాలు*
ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదించిన
ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో
విద్యార్థులు సాధించిన మార్కులకు 4 శాతం
మార్కులు కలుపుతామన్నారు.
రెండేళ్ల పీయూసీ అనంతరం విద్వార్తులకు బయటకు వెళ్లే
వెసులుబాటు కల్పిస్తామన్నారు. అభ్యర్థుల మెరిట్
ఆధారంగా కేటగిరీ ప్రకారం ప్రాధాన్యత క్రమంలో
క్యాంపస్లను కేటాయిస్తామన్నారు.
అందువల్ల అభ్యర్థులు తమ క్యాంపస్ ప్రాధాన్యతలను జాగ్రత్తగా సూచించాలని తెలిపారు. ఒకసారి క్యాంపస్ నిర్ధారణ జరిగిన తర్వాత బదిలీకి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. విద్యార్దులు ప్రవేశం పొందిన క్యాంపస్లోనే చదవాల్సి ఉంటుందన్నారు.
ONLINE APPLICATION DIRECT LINK
0 Response to "త్రిబుల్ ఐటీ లో ప్రవేశాలకు ప్రకటన - పూర్తి వివరాలు"
Post a Comment