ఏప్రిల్ నాటికి ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ శాసనమండలిలో మంత్రి బుగ్గన ప్రకటన
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపులన్నింటినీ ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శాసనమండలిలో బుధవారం ప్రకటించారు.
గ్రాట్యుటీ, జీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, ఇతర పింఛను ప్రయోజనాలకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి బకాయిలు లేవని,
నిర్ధిష్ట సమయంలోనే వాటి చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రావిడెంట్ ఫండ్, లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లింపులలో కొంత జాప్యం చోటు చేసుకుంటుందని చెప్పారు.
కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని, ఏప్రిల్ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితే ఉంటుందని మంత్రి పేర్కొన్నారు
0 Response to "ఏప్రిల్ నాటికి ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ శాసనమండలిలో మంత్రి బుగ్గన ప్రకటన"
Post a Comment