నేడే బడ్జెట్‌.. 2.40 లక్షల కోట్లతో వార్షిక పద్దు

అమరావతి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను శుక్రవారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై ఎవరికీ పెద్దగా అంచనాలేమీ లేవు. 


ఎందుకంటే రూ.1,50,000 కోట్ల పెండింగ్‌ బిల్లులు ఉంచుకుని వాటికి పైసా కూడా కేటాయించకుండా మళ్లీ కొత్తగా 2022-23 ఆర్థికసంవత్సరానికి రూ.2,30,000 కోట్ల నుంచి 2,40,000 కోట్ల అలవికాని బడ్జెట్‌ను జగన్‌ సర్కారు సిద్ధం చేసింది. ఇందులో ప్రభుత్వం చూపించే ఆదాయం అంచనాకి, ఖర్చు ప్రతిపాదనలకు, వాస్తవిక పరిస్థితులకు పొంతనే ఉండదని భావిస్తున్నారు.


 ఆ బడ్జెట్‌లో ప్రభుత్వం వేసే ఆదాయ అంచనాలు ఎలా ఉన్నా అప్పులు మాత్రం ఆదాయానికి రెండింతలు ఉంటాయనేది అసలు అంచనా. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లలో కేంద్రం నుంచి నిధులు ఎక్కువ రాబట్టుకోవడంపై దృష్టి సారిస్తాయి. కానీ మూడేళ్ల నుంచి జగన్‌ సర్కార్‌ మాత్రం రావాల్సిన నిధులను పట్టించుకోవడం లేదు. కొత్తగా కేంద్రం నుంచి అప్పులకు అనుమతి ఎలా 

తెచ్చుకోవాలనేదానిపైనే శాయశక్తులా కృషి చేస్తోంది. ఈ కొత్త బడ్జెట్లో కూడా వివిధ పద్దులకు, పథకాలకు, వివిధ శాఖలకు నామ్‌కేవాస్త్‌ బడ్జెట్‌ కసరత్తు చేశాం... చట్టసభల్లో ఆ మోదం పొందాం... అని అనిపించుకోవడానికి చేసిన కేటాయింపులే ఉంటాయని ఇతర శాఖల అధికారులు భావిస్తున్నారు. అంకెల్లో భారీతనం, బడ్జెట్‌ స్పీచ్‌లో ప్రభుత్వ డాంభికాలు తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే ఒ క్క కేటాయింపుకూడా ఉండకపోవచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేడే బడ్జెట్‌.. 2.40 లక్షల కోట్లతో వార్షిక పద్దు"

Post a Comment