ఏపీలో 14,341 పోలీసు పోస్టులు ఖాళీ

న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖలో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


 ఈ మేరకు లోక్‌సభలో డీఎంకే ఎంపీ పారివేందర్‌ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి  నిత్యానంద్‌ రాయ్‌ మంగళవారం  లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 



రాష్ట్రంలో 73,894 పోలీసుల పోస్టులు ఉండగా... ప్రస్తుతం 59,553 మంది పనిచేస్తున్నారని, 14,341 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.  ఏపీ పోలీసుల్లో 5.85 శాతం మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారని స్పష్టం చేశారు.

 అలాగే, మావోయిస్టుల హింసకు సంబంధించి ఏపీలో 2019 నుంచి 2021 మధ్యకాలంలో 41 ఘటనల్లో 10 మంది పౌరులు మరణించగా... 13 మంది మావోయిస్టులు మరణించారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.


 రాష్ట్రానికి ఇటీవల రూ.351.43 కోట్ల వరద సాయాన్ని ఆమోదించామని పలువురు వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో 14,341 పోలీసు పోస్టులు ఖాళీ"

Post a Comment