10.82 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు





10.82 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు జమ చేయనున్న సీఎం 

సాక్షి, అమరావతి: జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్‌–డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ. 709 కోట్లను బుధవారం సచివాలయంలో సీఎం జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా జమ చేయనున్నారు.

►జగనన్న విద్యా దీవెన.. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేసే పథకం. 
►ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు వారి కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే.
►జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఇప్పటివరకు  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ. 9,274 కోట్లు.
►టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ. 1,778 కోట్లు జగన్‌ ప్రభుత్వమే చెల్లించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "10.82 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు"

Post a Comment