గ్రామీణాభివృద్ధి శాఖలో ఎంపీడీఓలకు పోస్టులు
గ్రామీణాభివృద్ధి శాఖలో ఎంపీడీఓలకు పోస్టులు
6పీడీలు, 13 ఏపీడీలుగా అవకాశం

Video Player is loading.
అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరేట్ కార్యాలయం, రాష్ట్ర వ్యాప్తంగా డ్వామా కార్యాలయాల్లో ఎంపీడీఓలకు సుమారు 150 పోస్టులు కేటాయిస్తూ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయంలో ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీం(ఈజీఎ్స)కు సంబంధించి 15 పోస్టులను పదోన్నతి పొందిన ఎంపీడీఓలకు కేటాయించారు. అదే విధంగా జిల్లాల్లోని డ్వామా కార్యాలయాలకు సంబంధించి డ్వామా పీడీ పోస్టులు 6, అడిషనల్ పీడీ పోస్టులు 13, అడ్మిన్ ఆఫీసర్లు 13, ఏపీఓ(ఎంఅండ్ఈ) 13 పోస్టులు, ఏపీఓ(అక్కౌంట్స్) 8 పోస్టులు, ఫైనాన్స్ మేనేజర్లు 8, జిల్లా విజిలెన్స్ ఆఫీసర్లు 13, ఏపీడీలు 54 పోస్టులు మొత్తం కలిపి 134 పోస్టులు ఎంపీడీఓల కోసం కేటాయించారు
0 Response to "గ్రామీణాభివృద్ధి శాఖలో ఎంపీడీఓలకు పోస్టులు"
Post a Comment