డిజిటల్ లైబ్రరీల పనులు జూన్లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో చేపట్టిన
డిజిటల్ లైబ్రరీల పనులు జూన్లోగా పూర్తి చేయాలని
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
Internet కనెక్షన్తో పాటు డెస్క్టాప్, బల్ల, కుర్చీలు,
యూపీఎస్, ఇనుప అరలు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు వంటివి
అమర్వాలని స్పష్టం చేశారు. బుధవారం ఈ పనులపై తన
క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షించారు. తొలివిడతలో
4,580 డిజిటల్ లైబ్రరీల పనులు చేపడుతున్నట్లు అధికారులు
సీఎంకు వివరించారు. వీటికి అవసరమైన నెట్ కనెక్షన్ల
ఏర్పాటు వచ్చే నెల నాటికి పూర్తవుతుందన్నారు. మిగిలిన
లైబ్రరీల పనులను రెండోవిడతలో చేపట్టాలని సీఎం జగన్
సూచించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ లైబ్రరీలు
ఏర్పాటు చేసినట్లవుతుందన్నారు. వీటి ఏర్పాటుతో
ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సాధ్యమవుతుందని యు
అభిప్రాయపడ్డారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ సమీర్
శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
0 Response to "డిజిటల్ లైబ్రరీల పనులు జూన్లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్"
Post a Comment