బహుదూరపు బడి



  • స్కూల్‌కు వెళ్లాలంటే 3 కిలోమీటర్లు
  • జీవో 20కి సవరణ చేస్తూ ఉత్తర్వులు


అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): బడి బహుదూరం కానుంది. పిల్లల సమీపానికి బడులను తీసుకెళ్లాల్సిన ప్రభుత్వమే వాటిని దూరం చేసేస్తోంది. ప్రాథమిక పాఠశాలలు ఒక కిలోమీటరు దూరంలోనే ఉండాలన్న నిబంధనను ఎత్తేసి...మూడు కిలోమీటర్ల వరకు ఉండొచ్చంటూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇక 3,4,5తరగతులు చదువుకునే పిల్లలకు పాఠశాలలు సుదూరం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పేరుకు 250మీటర్లు దూరంలోని ప్రాథమిక పాఠశాలల్నే విలీనం చేయాలని తొలుత ఉత్తర్వులిచ్చినా ప్రభుత్వం మనసులో ఉంది మాత్రం మూడు కిలోమీటర్లే అని ‘ఆంధ్రజ్యోతి’ స్పష్టంగా రాసింది. ఇప్పుడు అదే నిజం చేస్తూ తాజాగా సోమవారం ఉత్తర్వులిచ్చింది. బడి పక్కనుంటే ఆసక్తిగా వెళ్లి చదువుకోడం, కార్మికులు, కూలీల పిల్లలు కూడా తామే నడుచుకుంటూ పాఠశాలలకు వెళ్లిపోవడం ఇప్పటివరకు చూశాం. ఇక మీదట ఆ చిన్నారులు నడవడానికి వీల్లేనంత దూరానికి పాఠశాలలు ఉం డేలా ప్రభుత్వమే మార్పులు చేసింది. 


ఈ మేర కు గతంలో ఇచ్చిన జీవో నం.20కి సవరణలు చేసింది. ఈ సవరణల ప్రకారం 3-5ఏళ్ల వయసున్న పిల్లలకు స్ర్తీ, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రీస్కూల్‌ పాఠశాలలు(అంగన్‌వాడీలు) ఉంటాయి. ఆ తర్వాత ఒకటినుంచి 8వ తరగతి వరకు ప్రాథమిక విద్యకిందకు వస్తుంది.  3-5 తరగతులు ఉంటే ప్రీ హైస్కూల్స్‌, హైస్కూల్స్‌ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఒకవేళ 3 కిలోమీటర్ల దూరంలో ఈ పాఠశాలలు లేకుంటే .. ప్రభుత్వమే రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఈ కొత్త విధానం పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి ఎక్స్‌ అఫిషియో చైర్మన్‌గా విద్యాశాఖ మంత్రి, కన్వీనర్‌గా ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు.


ఈ దూరం దుస్సాహసమే: ప్రభుత్వ తీసుకొచ్చిన ఆరు రకాల పాఠశాలల్లో భాగంగా తొలుత 250మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని నిర్ణయించారు. అది క్రమంగా కిలోమీటరుకు.. ఇప్పుడు ఏకంగా మూడు కిలోమీటర్ల దూరానికి పెరిగిపోవడం దారుణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉన్నత పాఠశాలకు 250మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలిపేయనున్నారు. ఇక మిగిలిన 1,2 తరగతులు ప్రస్తుతానికి అదే పాఠశాలలో ఉంటాయి. అంటే ఒకటినుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో ఇకపై 1,2తరగతులు మాత్రమే ఉంటా యి. ఆపై తరగతులు సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో కలిసిపోతాయి. తొలి ఏడాది 250మీటర్ల దూరంలోని పాఠశాలలను విలీనం చేస్తామన్న ప్రభుత్వం...భవిష్యత్తులో ఒక కిలోమీటరు లోపు దూరమున్న పాఠశాలల్ని కూడా విలీనం చేసేస్తారని సమాచారం. అంటే క్రమం గా గ్రామాల్లో ఉండే బడులు మాయమైపోతా యి. ప్రాథమిక విద్య పటిష్టత కోసం, విద్యార్థులను ఎక్కడికక్కడ పాఠశాలలో చేర్చుకునేందు కు వీలుగా ప్రారంభించిన ఈ పాఠశాలలు ఇక పెద్దగా కనిపించకుండా పోతాయి. దేశంలో మ రే రాష్ట్రంలోనూ మూడు కిలోమీటర్ల దూరంలో పాఠశాలలు ఉండేలా నిబంధనల్లో మార్పులు తెచ్చిన తొలి రాష్ట్రం ఏపీనే. ఇక, ఇప్పుడు 1-5 తరగతుల వరకు 2 స్కూళ్లు మా రాలి. ఇది పేద, బడుగు వర్గాల పిల్లలపై ప్రభా వం చూపించనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బహుదూరపు బడి"

Post a Comment