మరోసారి కొవిడ్‌ మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం




అమరావతి:
 ఏపీ ప్రభుత్వం మరోసారి కోవిడ్ మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్రం, డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగితే రూ. 100 జరిమానా విధించనుంది. మాస్క్‌ లేని వారిని దుకాణాలకు రానిస్తే.. ఆయా షాపులు, వాణిజ్య, వ్యాపార సంస్థల యజమానులకు రూ.10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిబంధనల ఉల్లంఘన జరిగితే వ్యాపార సంస్థలను రెండు రోజుల పాటు మూసివేయించనుంది. నిబంధనల ఉల్లంఘనలపై వాట్సాప్‌ నెం.80109 68295కు తెలపాలని ప్రభుత్వం సూచించింది. ఉల్లంఘనలపై కేసులు నమోదు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మార్గదర్శకాల అమలును పర్యవేక్షించాలని కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలకు ప్రభుత్వం ఆదేశించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మరోసారి కొవిడ్‌ మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం"

Post a Comment