అమరావతి: వేతన సవరణపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం మరోమారు చర్చలు జరిపింది. అమరావతి సచివాలయంలో ఆర్థిక శాఖ, ఇతర శాఖల కార్యదర్శులతో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో గుర్తింపు పొందిన సంఘాల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. పీఆర్సీతో పాటు ఆర్థికేతర అంశాల వారీగా సంఘాలతో ప్రతినిధులతో ప్రభుత్వం చర్చించింది. వీలున్నంతవరకు ఉద్యోగుల సమస్యలను సకాలంలో పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ కార్యదర్శులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో సమస్యలను కలెక్టర్లు.. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. వివిధశాఖల్లో ఉద్యోగుల పదోన్నతులపై వచ్చే ఏడాది నుంచి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ క్యాలెండర్లు రూపొందించాలని సీఎస్ నిర్దేశించారు
0 Response to "AP News: ఉద్యోగుల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలి: సీఎస్"
Post a Comment