బాలికలకు స్కాలర్‌షిప్‌లు

అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ విద్యాసంస్థలు గత ఏడేళ్లుగా నిర్వహిస్తున్న గెస్ట్‌(గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌) ఈ ఏడాది డిసెంబరు 12న నిర్వహించనున్నట్లు విద్యాసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. 


ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఇంటర్‌ చదువు నిమిత్తం ఉపకారవేతనం ఇస్తారు. మొదటి 10 ర్యాంకులు సాధించినవారికి నెలకు రూ.5వేల చొప్పున, ఆ తర్వాత 15 ర్యాంకులు సాధించిన వారికి నెలకు రూ.3 వేల చొప్పున అందిస్తారు. 



ఇంటర్‌ విద్య పూర్తయ్యేవరకు ఈ ఉపకార వేతనాలు కొనసాగిస్తారు. పదో తరగతి చదువుతున్న బాలికలందరూ ఈ పరీక్ష రాయవచ్చునని నారా భువనేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. 


ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఎన్‌టీఆర్‌ట్ర్‌స్ట.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో వచ్చే నెల 8వ తేదీ వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చనని సూచించారు. ఇతర వివరాలకు 7660002627, 7660002628 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బాలికలకు స్కాలర్‌షిప్‌లు"

Post a Comment