ఓబీసీల వర్గీకరణపై త్వరలో నివేదిక కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్‌ రోహిణి కమిషన్‌

 

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఉన్న ఓబీసీలను వర్గీకరించడం, కొత్త కులాలను చేర్చడంపై ఏర్పాటయిన జస్టిస్‌ రోహిణి కమిషన్‌ త్వరలో మధ్యంతర నివేదికను సమర్పించనుంది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓబీసీ జాబితాను ప్రకటించడానికి వీలుగా తొందరగా నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో యాదవేతర ఓబీసీలపై భాజపా దృష్టి పెట్టినందున ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఓబీసీల వర్గీకరణ ఎన్నికలపై ప్రభావం చూపనుందని అంచనా వేస్తున్నారు. భారీగా మార్పులు చేసి ఓబీసీ కులాల జాబితాను 2016లోనే నోటిఫై చేశారు. ఓబీసీలను వర్గీకరించడం, మరికొన్ని కులాలను కలిపే విషయమై అధ్యయనం చేయడానికి 2017లో ఈ కమిషన్‌ను కేంద్రం నియమించింది. ఇప్పటికి 11సార్లు కమిషన్‌ కాలపరిమితిని పొడిగించింది. దేశంలోని మొత్తం 2,633 కులాలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరించడంపై భారీగా కసరత్తు చేస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని ప్రతిపాదించామని, వీటికి ఆమోదం లభించవచ్చని భాజపా నాయకుడు ఒకరు చెప్పారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఓబీసీల వర్గీకరణపై త్వరలో నివేదిక కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్‌ రోహిణి కమిషన్‌"

Post a Comment